ఎన్నో వివాదాలు, మరెన్నో సమస్యల మధ్య మొదలైన ఐపీఎల్ జోరుగా హుషారుగా సాగుతోంది. అయితే, టోర్నీ మొత్తం మీద అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఒకే ఒక్కడు.. అతడే.. గ్లెన్ మాక్స్ వెల్. నిండు చందురుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు అన్నట్లు.. ఐపీఎల్ ప్లేయర్లంతా ఒక వైపు అయితే.. మాక్స్వెల్ మాత్రం మరోవైపు.
గత సీజన్లలో అత్యంత దారుణమైన ఆటతీరు ప్రదర్శించిన పంజాబ్ కింగ్స్ లెవన్ ఈసారి పాయింట్లలో టాప్ పొజిషన్లో ఉందంటే దానికి కారణం ఈ ఒక్కమగాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ మాక్స్వెల్ మాక్జిమమ్ బాదేయడంతో ప్రత్యర్థులకు చుక్కలు కనిపించాయి. చెన్నై కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 43 బంతుల్లోనే 95 పరుగులు పిండేశాడు మాక్స్. ఇదేదో గాలివాటం కాదని తర్వాతి మ్యాచ్ లోనే నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తర్వాతి మ్యాచ్ లో 45 బంతుల్లో 89 కొట్టాడు. ఇక మూడో మ్యాచ్ సన్ రైజర్స్ తో 43 బంతుల్లోనే మళ్లీ 95 కొట్టి తానెంత ప్రమాదకర ఆటగాడినో నిరూపించుకున్నాడు మాక్స్ వెల్.
ఐపీఎల్ ఈ సీజన్ ఇంతవరకూ 279 రన్స్ చేసిన వెల్.. టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు మూడు మ్యాచుల్లో 17 సిక్సులు బాది ఆ లిస్ట్ లోనూ ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు. మ్యాక్స్ వీరంగం చూసి వెల్ డన్ అంటూ ప్రీతి మురిసిపోతుంటే.. ముంబై, ఢిల్లీ టీమ్స్ మాత్రం ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు తెగ బాధపడిపోతున్నాయి. ఎందుకంటే, వేలం పాటలో మ్యాక్స్ వెల్ వెంట పడింది ఆ రెండు జట్లే. కోటి రూపాయల బేస్ ప్రైజ్ ను పెంచుకుంటూ వెళ్లింది ఆ రెండు జట్లే. ఐదు బడ్జెట్ దాటిపోతుందనుకున్న ఢిల్లీ టీమ్ వేలంలో వెనుకడుగు వేసింది. సరిగ్గా అప్పుడే రేసులోకి దూకింది ప్రీతి టీమ్. ముంబైతో పోటీ పడి మరీ ఆరు కోట్లకు మ్యాక్స్ ను తన బుట్టలో వేసుకుంది. అంతకు మించి పెట్టడం అనవసరం అనుకుని వదిలేసిన ముంబై.. ఇప్పుడు తెగ ఫీల్ అవుతోంది. అంతేకాదు.. 14 కోట్లు పెట్టి కొన్న మాల్యా కూడా.. అతనికి బదులు మ్యాక్స్ వెల్ ను తీసుకుని ఉంటే బాగుండని ఫీలవుతుండొచ్చు..
ఈ సీజన్ అంతా మ్యాక్స్వెల్ చుట్టూ తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాక్స్ను ఎలా కంట్రోల్ చేయాలా అనే ప్లాన్స్ వేసుకోవడం మునిగిపోయాయి మిగిలిన టీమ్స్.
గత సీజన్లలో అత్యంత దారుణమైన ఆటతీరు ప్రదర్శించిన పంజాబ్ కింగ్స్ లెవన్ ఈసారి పాయింట్లలో టాప్ పొజిషన్లో ఉందంటే దానికి కారణం ఈ ఒక్కమగాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ మాక్స్వెల్ మాక్జిమమ్ బాదేయడంతో ప్రత్యర్థులకు చుక్కలు కనిపించాయి. చెన్నై కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 43 బంతుల్లోనే 95 పరుగులు పిండేశాడు మాక్స్. ఇదేదో గాలివాటం కాదని తర్వాతి మ్యాచ్ లోనే నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తర్వాతి మ్యాచ్ లో 45 బంతుల్లో 89 కొట్టాడు. ఇక మూడో మ్యాచ్ సన్ రైజర్స్ తో 43 బంతుల్లోనే మళ్లీ 95 కొట్టి తానెంత ప్రమాదకర ఆటగాడినో నిరూపించుకున్నాడు మాక్స్ వెల్.
ఐపీఎల్ ఈ సీజన్ ఇంతవరకూ 279 రన్స్ చేసిన వెల్.. టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు మూడు మ్యాచుల్లో 17 సిక్సులు బాది ఆ లిస్ట్ లోనూ ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు. మ్యాక్స్ వీరంగం చూసి వెల్ డన్ అంటూ ప్రీతి మురిసిపోతుంటే.. ముంబై, ఢిల్లీ టీమ్స్ మాత్రం ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు తెగ బాధపడిపోతున్నాయి. ఎందుకంటే, వేలం పాటలో మ్యాక్స్ వెల్ వెంట పడింది ఆ రెండు జట్లే. కోటి రూపాయల బేస్ ప్రైజ్ ను పెంచుకుంటూ వెళ్లింది ఆ రెండు జట్లే. ఐదు బడ్జెట్ దాటిపోతుందనుకున్న ఢిల్లీ టీమ్ వేలంలో వెనుకడుగు వేసింది. సరిగ్గా అప్పుడే రేసులోకి దూకింది ప్రీతి టీమ్. ముంబైతో పోటీ పడి మరీ ఆరు కోట్లకు మ్యాక్స్ ను తన బుట్టలో వేసుకుంది. అంతకు మించి పెట్టడం అనవసరం అనుకుని వదిలేసిన ముంబై.. ఇప్పుడు తెగ ఫీల్ అవుతోంది. అంతేకాదు.. 14 కోట్లు పెట్టి కొన్న మాల్యా కూడా.. అతనికి బదులు మ్యాక్స్ వెల్ ను తీసుకుని ఉంటే బాగుండని ఫీలవుతుండొచ్చు..
ఈ సీజన్ అంతా మ్యాక్స్వెల్ చుట్టూ తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాక్స్ను ఎలా కంట్రోల్ చేయాలా అనే ప్లాన్స్ వేసుకోవడం మునిగిపోయాయి మిగిలిన టీమ్స్.
కామెంట్ను పోస్ట్ చేయండి