మైనార్టీ కార్డు చూసుకుని నోరు పారేసుకున్నందుకు మూల్యం చెల్లిస్తున్నారు మజ్లిస్ పార్టీ అగ్రనేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్. ప్రభుత్వం తమను ఏమీ చేయలేదన్న ధీమాతో రెచ్చిపోయిన మాట్లాడినందుకు ఇప్పుడు జైలు పాలయ్యారు. 15 నిమిషాల సమయం ఇస్తే దేశంలోని హిందువుల అంతు చూస్తామన్న అక్బరుద్దీన్.. ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. పైగా, జిల్లాకో కేసు ఆయనపై నమోదయ్యింది.
అటు 2005లో మెదక్ జిల్లా ముత్తంగి రోడ్డు విస్తరణ పనులను అడ్డుకోవడంతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ సింఘాల్ ను దూషించినందుకు అసద్ చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం అండ చూసుకుని ఇంతకాలం విచారణకు కూడా హాజరుకాకుండా ఉన్న అసద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో.. ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. దీంతో దిక్కుతోచని అసద్.. నేరుగా కోర్టుకు వెళ్లి లొంగిపోయారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. దాన్ని కొట్టివేయడంతో అసద్ కు కష్టకాలం మొదలైనట్లే.
ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న జగన్ ఎనిమిది నెలలుగా జైల్లోనే ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం నేతలు కూడా జైలు పాలయ్యారు. తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఇప్పట్లో మజ్లిస్ సోదరులకు బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఎంఐఎంలోనే మరో కీలక నేత పాషాఖాద్రీపై కూడా కేసులు నమోదు కావడంతో.. ఎంఐఎం నేతలకు దిక్కుతోచడం లేదు. ఓవైసీ బ్రదర్స్ త్వరగా బయటకు రాకపోతే మాత్రం.. ఎంఐఎం పరిస్థితి తెగిన గాలిపటంలా మారిపోయే అవకాశం ఉంది.
Read more...
asaduddin లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
asaduddin లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
22, జనవరి 2013, మంగళవారం
అన్నదమ్ములిద్దరూ ఇక జైల్లో మగ్గాల్సిందేనా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
