మద్యం మాఫియాలో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. మద్యం సిండికేట్లపై, ఎక్సైజ్ అధికారులపై ఏసీబీ పలు దఫాలుగా చేసిన దాడులు.. ఆశ్చర్యకరమైన వివరాలను బయటపెట్టాయి. సిండికేట్లను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే.. వాళ్లకు అప్పులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఏసీబీ గుర్తించింది. సిండికేట్లపై ఏసీబీ రూపొందించిన 750 పేజీల నివేదికలో పలు కీలక విషయాలున్నాయి.
ఏడు జిల్లాల్లో 22 ప్రాంతాల్లో 33 మద్యం సిండికేట్ కార్యాలయాలపై ఏసీబీ ఇటీవల దాడులు జరిపింది. మద్యం సిండికేట్లకు.. ఏసీబీ అధికారులు అప్పులు ఇస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది.
ఓ జిల్లాలో మద్యం సిండికేట్ నాయకుడికి ఆ ప్రాంత ఎక్సైజ్ సిబ్బంది రెండు కోట్ల 40 లక్షల రుపాయాలను అప్పుగా ఇచ్చారు. ఇందులో కేవలం ఓ హెడ్ కానిస్టెబుల్ వాటానే 53 లక్షలు ఉందంటే.. ఏ రేంజ్లో అవినీతి ప్రవాహం సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరో జిల్లాలో ఎక్సైజ్ అధికారుల నుంచి అప్పు తీసుకున్నందుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు 22 లక్షలు, ఓ సబ్ ఇన్స్పెక్టర్ 10 లక్షల వడ్డీని కట్టారని ఆధారాలు దొరికాయి. ఓ జిల్లాకు చెందిన సిండికేట్ నాయకుడు మరో జిల్లాకు చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లకు ఏడాది కాలంగా 37 లక్షల వడ్డీని చెల్లించినట్లు కీలక పత్రాలు ఏసీబీ చేతికి చిక్కాయి. ఈ ఆధారాలు చూస్తుంటే ఎక్సైజ్ అధికారులే మద్యం సిండికేట్లలో పెట్టుబడులు పెట్టి చీకటి వ్యాపారాన్ని పెంచి పోషిస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పటి వరకూ ఎక్సైజ్ అధికారులు, 11 మంది మద్యం సిండికేట్ల నాయకులతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికి చిన్న చేపలే ఏసీబీకి చిక్కాయి.. ఇక పెద్ద చేపలు వలలో పడితే.. ఇంకెన్ని సమ్..గతులు బయటకువస్తాయో.. !
Read more...
syndicate లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
syndicate లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
29, జనవరి 2012, ఆదివారం
వడ్డీకి ఇచ్చారు... వ్యాపారం చేసుకోమన్నారు..
మద్యం వ్యాపారులకు మూడింది
మద్యం సిండికేట్లపై రెండోరోజూ ACB దాడులు కొనసాగాయి. మొదటిసారి జరిపిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు ACB పక్కాగా దాడులు నిర్వహించింది. నెల్లూరు జిల్లాలో భారీగా అరెస్టులు చోటుచేసుకున్నాయి. సింగరాయకొండ ఎక్సైజ్ సీఐ గురవయ్య, సిండికేట్ అధ్యక్షుడు వెంకట్రావు, కోవూరు ఎక్సైజ్ ఎస్సై విజయకుమార్,బుచ్చిరెడ్డిపాళ్యం సిండికేట్ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లాలో మద్యం వ్యాపారి వెంకట్రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు తర్వాత అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్న ఎక్సైజ్ సీఐ గురవయ్యని అదుపులోకి తీసుకున్నారు...
ఇక ఉత్తరాంధ్రలో రెండ్రోజుల సోదాల్లో ముగ్గురు ఎక్సైజ్ అధికారులు, ఓ హెడ్కానిస్టేబుల్ సహా 11మందిని అరెస్ట్ చేశారు. సోదాల్లో ఎక్సైజ్ సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులకు నెలవారి కమిషన్లు అందినట్లు పక్కా ఆధారాలు లభించాయి. వ్యాపారుల అరెస్ట్ను వ్యతిరేకిస్తూ మద్యం డీలర్లు ACB కార్యాలయానికి తరలివచ్చారు. ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.
వరంగల్లో ఎనిమిదిమంది వ్యాపారులతో పాటు ఓ ఎక్సైజ్ సీఐని అరెస్ట్ చేసిన ACB వారికి MGMలో వైద్య పరీక్షలు నిర్వహించింది. తర్వాత వారిని హైదరాబాద్ తరలించింది. ఇంతకాలం దర్జాగా సిండికేట్లతో దోచుకున్న అక్రమార్కులు ఎప్పుడు ACB విరుచుకుపడుతుందా అన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

