కరుడు గట్టిన ఉగ్రవాది కసబ్ ఉరిశిక్ష అమలును ఆపరేషన్ కోడ్ ఎక్స్ గా నామకరణం చేసిన ప్రభుత్వం ఆఫ్జల్ గురు ఉరిశిక్షను ఆపరేషన్ త్రీస్టార్ గా పేర్కొంది. తీహార్ లోని మూడో నెంబర్ జైల్లో శిక్ష అమలుజరగడంతోనే ఆపరేషన్ త్రీస్టార్ అని వ్యవరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఉరిశిక్ష అమలు గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసని వారంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏం చేయాలన్నది ముందుగానే నిర్ణయం జరిగిపోయిందని, అంతా ప్లాన్ ప్రకారం పూర్తి చేసుకున్నాకే, ఉరి తీసిన విషయం బయటకు వచ్చిందని వారంటున్నారు. ఆఫ్జల్ ను ఎక్కడ ఖననం చేయాలన్నదానిపై తర్జనభర్జనలేవీ జరగలేదని, దాన్ని కూడా ప్రభుత్వం ముందే నిర్ణయించిందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు.
ఉరిశిక్షకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ లెటర్ ను జైలు సూపరింటెండెంట్ కు అందించిన ఆఫ్జల్, దాన్నితన భార్యకు చేరాల్సిందిగా కోరాడు. తన మరణం గురించి వేదన చెందవద్దని, కొడుకును జాగ్రత్తగా పెంచాలని, ఇతర కుటుంబ విషయాలను అందులో పేర్కొన్నట్లు జైలు సిబ్బంది తెలిపారు.
Read more...
afzal guru లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
afzal guru లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
12, ఫిబ్రవరి 2013, మంగళవారం
దానిపేరు ఆపరేషన్ త్రీస్టార్ అట
Categories :
afzal guru . death . hang . news . operation three star . tihar jail . TOP
10, ఫిబ్రవరి 2013, ఆదివారం
అదంతా మోడిని తట్టుకోవడానికేనా..?
Categories :
afzal guru . congress . election . hang . modi . POLITICS . rahul gandhi . sonia . TOP
మొన్న కసబ్.. నిన్న ఆఫ్జల్ గురు.. ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారు చేయడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఎవరూ ఊహించని దూకుడును ప్రదర్శిస్తోంది. ఉరిశిక్షల విషయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పైళ్ల దుమ్ము దులుపుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్న సమయంలో మైనార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాహసోపేతమైన చర్యే. మెజార్టీ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టైనా సరే మైనార్టీలకు కొమ్ము కాయడమే లౌకికవాదమనుకునే కాంగ్రెస్ ఇంతటి తెంగుపు ప్రదర్శిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అసలు యూపీఏ ఇంత సాహసాన్ని ఎందుకు ప్రదర్శిస్తోంది..?
జైపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో రాహుల్ ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసింది సోనియా. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థని ప్రకటించినట్లయ్యింది. అటు గుజరాత్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన నరేంద్రమోడి బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఎదుగుతున్నాడు. దేశంలోని హిందూసంస్థలన్నీ మోడీ పేరునే బలపరుస్తున్నాయి. వీహెచ్ పీ ఆరెస్సెస్ లాంటి సంస్థలూ బీజేపీపై ఈ విషయంలో వత్తిడి తెస్తున్నాయి. బీజేపీలో దీనిపై భిన్నవాదనలు ఉన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే మోడిమంత్రం జపించక తప్పని పరిస్థితి. ప్రస్తుతం దేశంలో మోడికి ఉన్న పాపులారిటీ, మరే లీడర్ కు లేదన్నది వాస్తవం. మీడియా జరుపుతున్న సర్వేల్లోనూ ప్రధాని అభ్యర్థిగా మోడినీ ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ కూడా మోడి కన్నా వెనుకబడే ఉన్నారు. సరిగ్గా ఇదే కాంగ్రెస్ పై ప్రభావం చూపించి ఉండొచ్చు.
చిన్న చితకా పార్టీలు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో తప్పిస్తే, దేశవ్యాప్తంగా మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపే ఉంటుంది. ఇక బీజేపీకి ప్రధాన బలమైన హిందుత్వ ఓటు బ్యాంకును కొల్లగొడితే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలిచి, రాహుల్ ను ప్రధానిని చేసే అవకాశాలు రాకపోవచ్చు. పైగా, ఆఫ్జల్ గురు వ్యవహారాన్ని, హిందుత్వ ఉగ్రవాదం విషయాన్ని వచ్చే ఎన్నికల్లో బీజేపీ అస్త్రంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే, బీజేపీకి ఆ అవకాశం లేకుండా చేయడానికే, ప్రభుత్వం హడావుడిగానే ఆఫ్జల్ గురును ఉరితీసినట్లు తెలుస్తోంది. దేశభద్రతకు సవాల్ విసురుతున్న ఉగ్రవాదంపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తామని ఈ రకంగా ఎన్నికలకు ముందు చెప్పుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.
హిందూ ఓట్లను ఆకర్షించడానికే కాంగ్రెస్ ఆఫ్జల్ గురును ఉరి తీయించి ఉండొచ్చనడానికి కళ్లముందే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 2006 లో ఆఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆయన భార్య రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకుంది. కానీ, అంతకు ముందు నుంచి పెండింగ్లో ఉన్న వాటిపై నిర్ణయం తీసుకోకుండానే, ఈ ఫైల్ ను క్లియర్ చేయశారు. వాటిలోనూ ముఖ్యంగా రాజీవ్ గాంధీ హంతకులు ఉండడం గమనార్హం. భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష పడ్డ మురుగన్, శాంతన్, అరివులకు.. 1999 మే నెలలో సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రెండువేల సంవత్సరంలో మెర్సీ పిటిషన్ను వీరు పెట్టుకున్నారు. ఈ కేసులో ఫైనల్ రికమండేషన్ను హోంశాఖ జూన్ 21, 2005న పంపించింది. ఈ పైల్ పెండింగ్ లోనే ఉంది. ఇక 1993 సెప్టెంబర్లో ఢిల్లీలో బాంబులు పేల్చిన ఖలిస్తాన్ (సిఖ్) తీవ్రవాది దేవిందర్ పాల్ సింగ్కు డిసెంబర్ 2002 లో సుప్రీం మరణశిక్ష విధించింది. 2003లో కరుణించమంటూ రాష్ట్రపతిని ఆయన వేడుకున్నాడు. ఆగస్టు 9, 2005న హోంశాఖ నుంచి సిఫార్సులు అంచాయి. అయినా.. ఈ ఫైల్కూ మోక్షం కలగలేదు. గంధపుచెక్కల దొంగ వీరప్పన్ అనుచరుడు సైమన్, మరో ముగ్గురుకి 2004 జనవరి 29న ఉరిశిక్ష పడింది. అదే ఏడాది రాష్ట్రపతిని శిక్ష తగ్గించమని ఆశ్రయించారు. 2005 మే2న హోంశాఖ ఈ ఫైల్ను రాష్ట్రపతి సెక్రటేరియెట్కు పంపించింది. దీన్ని కూడా పెండింగ్లోనే పెట్టారు. ఈ తీవ్రవాదులనందరినీ పెండింగ్ లో పెట్టి ఆఫ్జల్ గురు ఉరిపైనే నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి, యూపీఏ వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. కేవలం హిందువుల ఓట్లు సంపాదించడానికే ఈ ప్రయత్నం చేసిందనుకోవచ్చు. అలా కాదనుకుంటే, ఎన్నికల్లోగానే మిగిలిన వారి ఉరిశిక్షలపైనా రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.
Read more...
9, ఫిబ్రవరి 2013, శనివారం
షిండే ఆనాటి మాటల వెనుకున్న లెక్క ఇదేనా!
Categories :
afzal guru . death . hindutva terrorism . POLITICS . shinde . TOP
రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరులే అంటే.. ఇదే కాబోలు. పైకి మాట్లాడేది ఒకటైతే.. లోపల జరిగేది మరొకటి. మన రాజకీయాలను, మన పొలిటికల్ లీడర్లను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. తాజాగా అఫ్జల్ గురును ఉరి తీసే విషయంలోనూ ఇదే జరిగింది. హిందుత్వ ఉగ్రవాదంపై కామెంట్లు చేసి.. దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించిన షిండే.. అదే సమయంలో ఆఫ్జల్ గురును ఉరి తీసే ఫైల్పైనా సంతకం చేయడమే... యూపీఏ పొలిటికల్ స్ట్రాటజీకి అద్దం పడుతోంది.
పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి సూత్రధారి ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష వ్యవహారాన్ని చాపకిందనీరులా చక్కబెట్టారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడంకోసం మరో తేనెతుట్టెను కదిపారాయన. ఆఫ్జల్ గురు కు క్షమాభిక్ష తిరస్కరిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న జనవరి 21కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతకు ముందు మూడు రోజుల పాటు, జైపూర్లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబర్ను నిర్వహించింది. చివరి రోజు అంటే.. జనవరి 20న షిండే హిందుత్వ ఉగ్రవాదంపై వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్త దుమారాన్ని సృష్టించారు. బీజేపీ , ఆరెస్సెస్లు ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నాయని, హిందుత్వ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయనీ చింతన్ శిబిర్లో ఆరోపించారు షిండే. పైగా, నిఘా వర్గాల సమాచారమూ తమ దగ్గర ఉందని దాన్ని సమర్థించుకున్నారు.
షిండే వ్యాఖ్యలపై హిందుత్వవాదులు విరుచుకుపడ్డారు. ఆర్ఎస్సెస్, బీజేపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. షిండేను పదవినుంచి దింపాలంటూ డిమాండ్ చేశాయి. జైపూర్లో హిందుత్వ ఉగ్రవాద చిచ్చు రగిలించి.. ఢిల్లీకి చేరుకున్న షిండే.. చాలా ప్రశాంతంగా జనవరి 21న ఆఫ్జల్ గురును ఉరితీయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. ఫైల్పై సంతకం చేసి రాష్ట్రపతికి పంపించారు.
హిందుత్వ ఉగ్రవాదం విమర్శలు చేసిన మరుసటి రోజే.. ఆఫ్జల్ గురును ఉరి తీయాలని షిండే ఎందుకు డిసైడ్ అయ్యారన్నదే ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఆఫ్జల్ గురును ఉరితీయాలని ముందే డిసైడ్ అయిన షిండే, ఆ పని చేస్తే, మైనార్టీల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత వస్తుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే, దేశంలో హిందుత్వ ఉగ్రవాదం రాజ్యమేలుతోందంటూ విమర్శలు చేశారు. అటు హిందుత్వ ఉగ్రవాదం ఉందని ప్రకటించడం.. ఇటు ఆఫ్జల్ గురును ఉరి తీయమని సంతకం చేయడం.. రెండింటికీ లెక్క సరిపోయిందనుకున్నారాయన. హిందుత్వ ఉగ్రవాదంపై మాట్లాడినందుకు మైనార్టీల్లోనూ.. ఆఫ్జల్ను ఉరితీయడం వల్ల మిగిలిన వర్గాల్లోనూ కాంగ్రెస్కు ఇమేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు షిండే.
Read more...
ఆఫ్జల్ గురు ... ఆ చివరి క్షణాలు
Categories :
afzal guru . death . hang . news . parliament attack . TOP
ఉగ్రవాది ఆఫ్జల్గురుకు క్షమాభిక్ష ఇవ్వరాదన్న కేంద్ర హోంశాఖ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత, అన్ని వ్యవహాలు అత్యంత వేగంగా గుట్టుగా సాగిపోయాయి. శుక్రవారమే కోర్టు ఉరిశిక్షను అమలు చేసే తేదీని, సమయాన్ని ఖరారు చేసింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారమే వ్యవహరించిన తీహార్ జైలు అధికారులు.. ఉరి తీస్తున్నామన్న విషయాన్ని ఆ సాయంత్రమే అతనికి చెప్పారు అధికారులు. ఈ విషయం తెలియగానే గురు... ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. అదే ఆలోచనలతో గడిపిన ఆఫ్జల్.. రాత్రి భోజనం కూడా చేయలేదు. కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాడు..
చివరి క్షణాలను ప్రశాంతంగా గడపడం కోసం.. ఓ మత గ్రంథాన్ని ఇవ్వాల్సిందిగా కోరాడు ఆఫ్జల్ గురు. ఉదయాన్నే ఉరికంబం వైపు, మౌనంగా నడిచాడు. మానసికంగా కుంగిపోయినట్లు ఆసమయంలో కనిపించాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. చనిపోవడానికి ముందు ఓ చివరి కోరికను కూడా కోరినట్లు సమాచారం. అయితే, నిబంధనల ప్రకారం అదేమిటన్నది బయటేకు వెల్లడించలేమంటున్నారు జైలు అధికారులు.
ఉరిశిక్ష అమలు చేయడానికి ముందే, ఆ సమాచారాన్ని ఆఫ్జల్ గురు కుటుంబానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు అధికారులు. ఓ న్యాయమూర్తి, డాక్టర్, కొంతమంది జైలు అధికారుల సమక్షంలో ఉదయం 8 గంటలకు తీహార్లోని మూడో నెంబర్ జైలులో ఆఫ్జల్ గురును ఉరితీశారు. అనంతరం జైలు ఆవరణలోనే మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలను ఓ ముస్లిం మతపెద్ద సమక్షంలో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. భద్రతా కారణాల రీత్యా ఉరి తీసిన తలారి వివరాలను అధికారులు రహస్యంగా ఉంచారు.
Read more...
ఆఫ్జల్ గురును ఉరి తీశారు
Categories :
afzal guru . death centence . hang . news . terrorist . tihar jail . TOP
పార్లమెంట్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్జల్ గురును ఎట్టకేలకు ఉరి తీశారు. ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లో ఉన్న ఆఫ్జల్ గురును, అదే జైల్లో ఉరి తీశారు. ఉరిశిక్ష అమలు విషయం తెలుసుకుని గురు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెందారు. అతని మృతదేహాన్ని తమకు అప్పగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఆఫ్జల్ గురును బయటెక్కడ ఖననం చేసినా, అది తీవ్రవాదులకు, మతోన్మాదులకు పవిత్రస్థలంగా మారిపోతుందని, ఉగ్రవాదులను మరింతగా రెచ్చగొడుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకే, కసబ్ తరహాలోనే తీహార్ జైల్లోనే ఓ ప్రాంతంలో ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. కసబ్ వ్యవహారంలానే ఈ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా వ్యవహరించింది. కసబ్ కు క్షమాభిక్ష ఇవ్వకూడదని కేంద్ర హోంశాఖ నిర్ణయించుకున్నప్పటి నుంచి.. దానికి రాష్ట్రపతి ఆమోదం.. జైలు అధికారులకు ఆదేశాలు.. చివరకు ఉరిశిక్ష అమలు వరకూ చిన్న విషయాన్ని కూడా బయటకురాకుండా జాగ్రత్త పడింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.
కేసు పూర్వాపరాలు
డిసెంబర్13, 2001 లో పార్లమెంట్ పై దాడికి జైషే -ఈ - మహమ్మద్ టెర్రరిస్ట్ అయిన ఆఫ్జల్ గురు కుట్ర పన్నాడు. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు డిసెంబర్ 18, 2002న ఉరి శిక్ష విధించింది. అక్టోబర్ 29, 2003న ఢిల్లీ హైకోర్టు దీన్ని సమర్థించింది. ఉరిశిక్షను రద్దుచేయాలన్న అప్పీల్ ను సుప్రీంకోర్టు ఆగస్టు 4, 2005న తిరస్కరించడంతో.. ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష ఖరారయ్యింది. అయితే.. దాదాపు ఏడేళ్ల పాటు దీనిపై నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఇటీవల కసబ్ ను ఉరితీసిన ప్రభుత్వం.. గురు వ్యవహారంలోనూ నిర్ణయం తీసుకుంది. ఉరి తీయాలన్న ఫైల్ ను రాష్ట్రపతికి జనవరి 21న పంపించింది కేంద్ర హోంశాఖ. ఫిబ్రవరి 3న దీనిపై సంతకం చేశారు ప్రణబ్ ముఖర్జీ. అప్పటినుంచి ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన కేంద్రం.. ఫిబ్రవరి 9న ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లోనే ఆఫ్జల్ గురును ఉరి తీసింది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)



