అన్ని రంగాల్లోనే అభివృద్ధిని సాధించిన హైదరాబాద్ కు ధీటుగా రాజధాని నిర్మాణం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. హైదరాబాద్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఐదు దశాబ్ధాల్లో 15 లక్షల కోట్ల వరకూ ఖర్చుపెట్టాయంటున్న ఆయన.. అలాంటి నగరాన్ని ఇప్పటికిప్పుడు సృష్టించాలంటే.. కనీసం నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. తిరుపతిలో జరిగిన ఆర్థికసంఘం సమావేశంలో దీనిపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో కేంద్రం సాయంగా లక్షా 2 వేల కోట్లను ఇవ్వాలని కోరారు. దీంతో పాటు, కేంద్రం దగ్గర రాష్ట్రానికి ఉన్న రూ. 10400 కోట్ల అప్పులను రద్దు చేయాలని, అప్పులు మరింతగా తెచ్చుకోవడానికి FBRM చట్టాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈ విజ్ఞప్తులకు కేంద్రం ఎంతవరకూ సహకరిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రైతు రుణమాఫీ విషయంలో కేంద్ర సహకారాన్ని ఎంతో ఆశించిన బాబుకు.. చుక్కెదురయ్యింది. ఇప్పుడు రాజధాని వ్యవహారంలో కేంద్రం తీరు ఎలా ఉండొచ్చన్నదానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది..
బాబు కోరిక తీరుతుందా..?
Categories :
ANDHRA PRADESH . capital . chandrababu . modi . POLITICS . tdp . vijayawada
అన్ని రంగాల్లోనే అభివృద్ధిని సాధించిన హైదరాబాద్ కు ధీటుగా రాజధాని నిర్మాణం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. హైదరాబాద్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఐదు దశాబ్ధాల్లో 15 లక్షల కోట్ల వరకూ ఖర్చుపెట్టాయంటున్న ఆయన.. అలాంటి నగరాన్ని ఇప్పటికిప్పుడు సృష్టించాలంటే.. కనీసం నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. తిరుపతిలో జరిగిన ఆర్థికసంఘం సమావేశంలో దీనిపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో కేంద్రం సాయంగా లక్షా 2 వేల కోట్లను ఇవ్వాలని కోరారు. దీంతో పాటు, కేంద్రం దగ్గర రాష్ట్రానికి ఉన్న రూ. 10400 కోట్ల అప్పులను రద్దు చేయాలని, అప్పులు మరింతగా తెచ్చుకోవడానికి FBRM చట్టాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈ విజ్ఞప్తులకు కేంద్రం ఎంతవరకూ సహకరిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రైతు రుణమాఫీ విషయంలో కేంద్ర సహకారాన్ని ఎంతో ఆశించిన బాబుకు.. చుక్కెదురయ్యింది. ఇప్పుడు రాజధాని వ్యవహారంలో కేంద్రం తీరు ఎలా ఉండొచ్చన్నదానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది..
ఒబామా రూల్ నే ఫాలో అయిన మోడీ
Categories :
bjp . cabinet . External Affairs . modi . POLITICS . sushma swaraj
ఇక్కడ సీన్ కట్ చేసి , ఓ సారి అమెరికా కు వెళ్దాం. అక్కడ కూడా ఇదే సీన్. ఆరేళ్ల క్రితం ఒబామాతో అధ్యక్ష అభ్యర్థిగా హోరాహోరీగా తలపడ్డారు హిల్లరీ క్లింటన్. చివరకు పార్టీలో ఎక్కువ మద్దతు కూడగట్టిన ఒబామా అధ్యక్ష అభ్యర్థిగా నిలబడడం, ఆపై విజయం సాధించడం అందరికీ తెలిసిందే. ఎన్నికలయ్యాక, హిల్లరీ క్లింటన్ ను తన కేబినెట్ లో చేర్చుకున్నారు, అయితే, దేశానికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో తనకు ఎక్కడ హిల్లరీ క్లింటన్ అడ్డు తగులుతుందోనని భావించిన ఆయన తెలివిగా ఆమెకు విదేశీ వ్యవహారాలను అప్పగించారు.
ఇప్పుడు మోడీ కూడా అదే పని చేశారు. సుష్మాకు ఏ ఫోర్ట్ ఫోలియో దక్కుతుందోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఆమెకు విదేశీ వ్యవహారాలిచ్చి చేతులు దులుపుకున్నారు మోడీ. తనకు అనుకూలంగా ఉండే అరుణ్ జైట్లీకి కీలకమైన ఆర్థిక, రక్షణ శాఖలను , హోం శాఖను రాజ్ నాథ్ కు కేటాయించి తన చాణక్యాన్ని చాటుకున్నారు మోడీ.
మోడీ మంత్రులు వీళ్లే..
కేబినెట్ ర్యాంక్ మంత్రులు
రాజ్నాథ్ సింగ్
అరుణ్ జైట్లీ
నితిన్ గడ్కరీ
సుష్మా స్వరాజ్
వెంకయ్య నాయుడు
సదానంద గౌడ
ఉమా భారతి
నజ్మా హెప్తుల్లా
గోపీనాథ్ ముండే
రాం విలాస్ పాశ్వాన్
కాల్ రాజ్ మిశ్రా
మనేకా గాంధీ
అనంత్ కుమార్
రవి శంకర్ ప్రసాద్
అశోక్ గజపతి రాజు
అనంత్ గీతే
హర్ స్మిత్ కౌర్ బాదల్
నరేంద్ర సింగ్ తోమర్
జువాల్ ఓరమ్
రాధా మోహన్ సింగ్
తవార్ చంద్ గెహ్లాట్
సృతి ఇరానీ
హర్షవర్ధన్
ఈ జాబితాను ఇప్పటికే రాష్ట్రపతికి పంపించారు మోడీ. ఇక వీరిలో ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ ను కుళ్లబొడిచేశారు..
మోడీని విధ్వంసకర శక్తిగా చూపించడానికి ప్రయత్నించి దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్, దానికి తగ్గ మూల్యమే చెల్లించుకుంది. ఎప్పుడూ లేనంతగా దేశం ఒక్కటై, మోడీకి భారీ మెజార్టీ కట్టబెట్టింది. 285 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, ఎవరి దయాదాక్షిణ్యాలమీద బతకకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమంటూ ఆశీర్వదించింది.
అవినీతి భారతాన్ని నిర్మిద్దామన్న చంద్రబాబు
తెలంగాణ ముగిసింది.. ఆంధ్ర మిగిలింది
తెలంగాణలో ప్రచారానికి తెరపడుతుండడంతో సీమాంధ్రపైకి దృష్టి మళ్లించాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు కొన్ని జిల్లాల్లో ప్రచారం పూర్తి చేయగా, బాలయ్య కూడా విరామం లేకుండా ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు స్టార్ క్యాంపైనర్ గా చిరంజీవి తన పని మొదలుపెట్టారు. అన్నింటికీ మోడీ మంత్రాన్నే వల్లె వేస్తున్న బీజేపీ, సీమాంధ్రలోనూ ఆయన్నే ప్రచారానికి పిలుస్తోంది. ఏప్రిల్ 30, మే1 తేదీల్లో ఆయన సీమాంధ్రలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 30న తిరుపతిలో, మే 1న విశాఖలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక మే 2 సోనియా విశాఖ బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ సభ జరిగిన తర్వాతి రోజే సోనియా సభ జరుగుతుండడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. అటు రాహుల్తో కూడా వీలైనంతగా సభలను నిర్వహించాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
గడ్డం లేని మోడీ
Categories :
bjp . modi . POLITICS . without beard
కమలానికి సైకిల్ రాం..రాం.
Categories :
alliance . bjp . chandrababu . modi . nda . POLITICS . seemandhra . tdp
అయితే, పురంధేశ్వరికి బీజేపీ టికెట్ ఇవ్వడం, రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వకపోవడం వల్లే పొత్తును రద్దు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పురంధేశ్వరిని పూర్తిగా పక్కన పెట్టడానికి, నర్సాపురంలో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడానికి కమలం పార్టీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆరెస్సెస్ నుంచి వత్తిడి పెరగడంతో గోకరాజు గంగరాజును నర్సాపురం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. దీంతో అవాక్కైన రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో చర్చలు జరిపారు. తాజాగా ఆయన టీడీపీ తరపునే నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రద్దైనప్పటికీ, తెలంగాణలో మాత్రం పొత్తు కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు, మోడీ, చంద్రబాబు సంయుక్త సభలు లేకుండా ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ నిజం ఒప్పేసుకున్న మోడీ
Categories :
bjp . election . JASHODABEN . modi . MODI WIFE . NOMINATION . POLITICS
మోడీ గుజరాత్ సీఎం అయినప్పటి నుంచీ ఆయన పెళ్లి వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. జశోదాబెన్ తానే మోడీ భార్యనంటూ మీడియా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటోంది. దీన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా ఇతర ప్రతిపక్షపార్టీలు ఎప్పటికప్పుడు మోడీ టార్గెట్ చేసుకోవడానికి వాడుకున్నాయి. అయితే, ప్రతీ సారి తాను బ్రహ్మచారినే అంటూ వాటిని ఖండిస్తూవచ్చాడు గుజరాత్ సీఎం. అంతేకాదు, 2001, 2002, 2007, 2012 ఎన్నికల్లో సమర్పించిన నామినేషన్ పత్రాల్లో భార్య పేరును రాయలేదు. ఈ సారి ఏకంగా ప్రధాని పదవికే పోటీ పడుతున్న సమయంలో మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించడం సంచలనం కలిగిస్తోంది. తనపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టడానికే మోడీ ఇలా చేసి ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే, ఇది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు మంచి ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. అటు, ఈ అంశంతో మహిళల్లోనూ మోడీ ఇమేజ్ పలచన పడొచ్చన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
మోడీకి 17 ఏళ్ల వయస్సులోనే జశోదా బెన్ తో వివాహం జరిగింది. కానీ వారి కాపురం మాత్రం ముందుకు సాగలేదు. వివాహం అనంతరం ఆరెస్సెస్ ప్రచారక్ గా మారిన మోడీ, జశోదాను మళ్లీ కలవలేదు. అటు మోడీ.. ఇటు జశోదా ఇద్దరూ మళ్లీ వివాహం చేసుకోలేదు. ఇప్పుడు జశోదా తన భార్యేనని మోడీ అంగీకరించడంతో మళ్లీ ఆమె వార్తల్లో వ్యక్తయ్యింది. అయితే, ఆమెను ఇప్పటికైనా మోడీ తన ఇంటికి తీసుకెళ్తాడా లేక.. ఇంతకు ముందులానే వ్యవహరిస్తాడా అన్నది చర్చనీయాంశమయ్యింది..
ఇంత భావ దారిద్ర్యమా..?
రాహుల్ ప్రకటనలో ఉన్న స్లోగన్ ను మోడీ ఎప్పుడో వాడేశారు. ప్రభుత్వ అధికారుల్లో స్ఫూర్తి నింపడం కోసం ఏర్పాటు చేసిన ఓ సభలో మై నహీ, హమ్ అన్న స్లోగన్ ను ఉపయోగించారాయన. ఈ విషయం గుర్తించని కాంగ్రెస్ దాన్నే తమ పార్టీ లైన్ గా భారీగా ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఆన్ లైన్ లో రెండింటినీ పోల్చుతూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మీడియా కూడా దీన్ని పెద్దది చేసి చూపడంతో ఒక్కసారిగా అవాక్కైన కాంగ్రెస్, తన ప్రకటనలను ఉపసంహరించుకొంది. ఢిల్లీలో ఫ్లెక్సీలను వెంటనే మార్చేసింది. అదే అర్థం వచ్చినట్లుగా, మరో స్లోగన్ ను తెరపైకి తెచ్చింది. అదే .. తోడే నహీ.. జోడే.. కాంగ్రెస్ కు సొంతగా ప్రచారం చేసుకునే సత్తా కూడా లేకే, మోడీ స్లోగన్స్ పై పడిందంటూ బీజేపీ మండిపడింది.
ఉల్లి ధర పెరగడానికి మోడీ కారణమా..?
Categories :
bjp . congress . kapil sibal . modi . onion price . POLITICS . TOP
గుజరాత్లోని ఖచ్ ప్రాంతంలో ఉల్లిపాయలు ఎక్కువగా పండించే వేలాది ఎకరాలను అదాని గ్రూప్కు మోడీ కట్టబెట్టారని, దాని వల్లే ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని సిబల్ ఆరోపించారు. మరి దీనికి బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మోడి కన్నా నువ్వు బెటర్.. రాహుల్ కన్నా నువ్వు బెటర్
Categories :
bjp . congress . digvijay . digvijaysingh . modi . POLITICS . sushma swaraj . TOP
దీనికి సుష్మా స్వరాజ్ వెంటనే ప్రతిస్పందించారు. రాహుల్ గాంధీ కన్నా దిగ్విజయ్ సింగే బెటర్ అంటూ ట్విట్టర్లోనే సెటైర్ వేశారు సుష్మా.
మోడి కోసం వాస్తు వేదిక
అతను ప్రధానైతే అంతకన్నా సంతోషముండదంట
మోడీతో బాబు ములాఖత్
అద్వానీ అస్త్రసన్యాసం వెనుక..?
సిద్ధాంతాలు దూరమయ్యాయనా..? ప్రధాని పదవి దక్కదనా..?
బీజేపీ అగ్రనాయకత్వంపై అద్వానీ చేస్తున్న విమర్శలు, కొంతకాలంగా ఆయన వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలు, ఆయన తీరును చెప్పకనే చెబుతున్నాయి. మోడీకి మొదట్నుంచి అండదండలు అందించి, ఇంతటివాడిని చేసిన అద్వానీ... జాతీయస్థాయిలో అతను ఎదగడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. ఓ రకంగా ఈ ఎన్నికలే అద్వానీ ప్రధాని కావడానికి చివరి అవకాశం. యూపీఏ పనితీరు బాగోలేదు కాబట్టి, ఈ సారి ఎన్డీఏకు ఎలాగైనా మెజార్టీ వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాకపోతే, బీజేపీ నేతలకు మాత్రం అద్వానీ నాయకత్వంపై ప్రస్తుతం నమ్మకం లేదు. యువతను, హిందుత్వవాదులను ప్రబలంగా ఆకర్షించగల మోడి మంత్రాన్నే ఎక్కువ మంది జపిస్తున్నారు. మోడిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బలమైన హిందూ ఓటు బ్యాంకును సాధించవచ్చని ఆశిస్తున్నారు. కానీ, మైనార్టీ ఓట్లపైనే బతికే బీజేపీయేతర పార్టీలు ఇందుకు మొదట్నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా దీన్నే అస్త్రంగా మలచుకొని, కొంతకాలంగా మోడి విషయంలో విబేధిస్తూ వస్తున్నారు అద్వానీ. ముఖ్యంగా మోడి వల్ల బీజేపీకి విజయం దక్కితే ప్రధాని పదవి అద్వానికి ఏమాత్రం అందదు.
ప్రస్తుతం అద్వానీ రాజీనామా చేయడానికి కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే, బీజేపీలో అద్వానీ కన్నా కరుడుగట్టిన హిందుత్వవాది మరొకరు లేదన్నది బహిరంగ సత్యం. రామ్ మందిర్ నినాదంతోనే బీజేపీకి జవసత్వాలు ఊదిన చరిత్ర అద్వానీది. మోడి కూడా హిందుత్వ విషయంలో అద్వానీ తర్వాతే అని చెప్పుకోవాలి. రధయాత్ర చేసినప్పుడు, ఎంతో వివాదాస్పదమైన రామ్ జన్మభూమి నినాదం తీసుకున్నప్పుడు.. అద్వానీకి ముఖర్జీ సిద్దాంతాలు గుర్తుకురాలేదా....? ఇప్పుడు మోడిని భుజాలపైకి ఎత్తుకునేసరికే అవన్నీ గుర్తుకువచ్చాయా....?
ఏమైనా రాజకీయాల్లో ఒక్కో అడుగు ఎక్కుతూ ఎంతో ఎత్తుకు చేరుకున్న అద్వానీ, ఈ విషయంతో మాత్రం తన చిన్నతనాన్ని చాటుకున్నారనే చెప్పాలి.
ఆడాళ్లలోనే అతనికి మద్దతు ఎక్కువట..!
Categories :
bjp . congress . modi . pm candidate . POLITICS . rahul gandhi . survey . TOP
ప్రధాని రేసులో రాహుల్ గాంధీ వెనుకబడ్డాడు. వారసత్వం వద్దంటూ, ప్రధాని పదవిపై ఆశలేదంటూ వేదాంతం వల్లిస్తున్న రాహుల్ గాంధీని... భావిప్రధానిగా భావిస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది. IPSOS అనే సంస్థ చేసిన సర్వేలో, 43 శాతం మంది వచ్చే ప్రధానిగా మోడికే ఓటేశారు. ఈ సర్వేలో రాహుల్ గాంధీకి రెండో స్థానం దక్కింది. మోడిని ఆదరిస్తున్న వారిలో మగవాళ్లే ఎక్కువగా ఉన్నారు. లక్నో, బెంగళూరు, చెన్నైలో మోడికి మద్దతు ఎక్కువగా ఉంది. కోల్ కతా, ఢిల్లీ, ముంబైల్లో మోడిపై సెంటిమెంట్ ఎక్కువగా కనిపించింది. ఇక రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూడాలనుకుంటున్న వారిలో మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. కోల్ కతా, లక్నో, ముంబై, ఢిల్లీలో రాహుల్ పై వ్యతిరేకత వచ్చినట్లు సర్వేలో తేలింది. అదంతా మోడిని తట్టుకోవడానికేనా..?
Categories :
afzal guru . congress . election . hang . modi . POLITICS . rahul gandhi . sonia . TOP
బాలయ్య వెళ్లడం బాబుకు మచ్చా..?
Categories :
balakrishna . chandrababu . modi . POLITICS . tdp . TOP












