నిజమే.. నిజాయతీగా పనిచేసినందుకు ఓ ఐఏఎస్ అధికారికి దక్కిన బహుమానమిది. 30 ఏళ్లలో ఆయన్ను ఏకంగా 60 సార్లు ట్రాన్స్ఫర్ చేసి తమ కక్ష తీర్చుకుంది ఆ ప్రభుత్వం.. ఒక్కనిమిషం మీరు ఊహిస్తున్నట్లు అతను సోనియా అల్లుడు వాద్రా భూముల వ్యవహారం బయటపెట్టిన అశోక్ ఖేమ్కా కాదు.. ఈయన ప్రదీప్ కాస్ని. ఈయన కూడా హర్యానాలోనే ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. అక్కడి సీఎం హుడా హడావుడిగా నియమించిన సమాచార కమిషనర్లకు అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వనందుకు ఆయన్ను లో ప్రొఫైల్ పోస్ట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు హుడా. 1984లో స్టేట్ సివిల్ సర్వీస్ లో చేరిన కాస్ని అంచెలంచెలుగా ఎదిగారు. 2006లో స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన 30 నిమిషాల్లోనే ఆయనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందింది. 2012లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ డైరెక్టర్ గా మూడురోజులు పనిచేయగానే మరో చోటకి బదిలీ అయ్యింది. ఇలాంటి అనుభవాలు ఆయనకు ఎన్నో. అయితే.. ఈ ట్రాన్స్ఫర్లు తనకు కొత్తేమీ కాదని.. ఎక్కడున్నా సమర్థవతంగా పనిచేయడమే తనకు తెలుసంటున్నారు ప్రదీప్ కాస్ని.
ias officer లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
ias officer లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
6, ఆగస్టు 2014, బుధవారం
30 ఏళ్లు.. 60 ట్రాన్స్ఫర్లు
Categories :
30 years 60 transfers . haryana . hooda . ias officer . news . pradeep kasni . transfer
Read more...
6, జూన్ 2014, శుక్రవారం
అందరికీ అదనంగా ఇస్తున్న కేసీఆర్
Categories :
ఆశించినదానికన్నా అదనంగా అధికారులకు ఇస్తూ కొత్త రికార్డు సృష్టిస్తున్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రులకూ ఒకటికి రెండు మూడు శాఖలను కేటాయించిన ఆయన.. అదే ట్రెండ్ ను అధికారుల విషయంలోనూ ఫాలో అవుతున్నారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఇప్పటికే సీసీఎల్ఏ అదనపు బాధ్యతలు కేటాయించారు. దీనికి తోడు ఆర్థిక శాఖలో ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుకు, రాష్ట్ర విభజన సంబంధింత అంశాలను అదనంగా అప్పగించారు. మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ను సీఎంఓలోకి తీసుకున్నప్పటికీ, జిల్లా బాధ్యతలను అదనంగా ఆమెకే అప్పగించారు. తాజాగా, తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి జనార్దనరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో, ఇంకా ఎంతమంది అధికారులకు అదనపు బాధ్యతలు అందుతాయో అన్న చర్చ సచివాలయంలో జోరుగా సాగుతోంది.
5, ఏప్రిల్ 2013, శుక్రవారం
ట్రాన్స్ ఫర్స్ లో ఈయన్ని మించినోడు లేడు
Categories :
ashok khemka . haryana . ias officer . news . rabert vadra . sonia . TOP . transfer
ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, 20 ఏళ్ల సర్వీసులో ఎన్నిసార్లు ట్రాన్స్ ఫర్ అయి ఉంటారు.. సాధారణంగా ఒక్కో చోట కనీసం రెండేళ్లన్నా ఐఏఎస్ అధికారులు పనిచేస్తారు. పోనీ ఏడాదే వేసుకున్నా.. 20 ఏళ్లలో 20 ట్రాన్స్ ఫర్స్. కానీ, హర్యానా కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, అశోక్ ఖేమ్కా మాత్రం, ఈ 20 ఏళ్లలో 44 సార్లు ట్రాన్స్ ఫర్స్ ఆర్డర్స్ అందుకున్నారు. అంటే సగటున ఆర్నెళ్లు కూడా ఆయన్ను ప్రభుత్వం స్థిరంగా ఉండనివ్వలేదన్నమాట.
ఇంతకీ ఈ అశోక్ ఖేమ్కా ఎవరో తెలుసా.. రియాల్టీ దిగ్గజం డీఎల్ ఎఫ్ కు సోనియా అల్లుడు రాబర్డ్ వాద్రాకు మధ్య అక్రమంగా జరిగిన భూ బదలాయింపును రద్దు చేసిన అధికారి. ఆ కేటాయింపులు రద్దు చేసిన వెంటనే ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించింది హర్యానా సర్కార్. అనంతరం హర్యానా సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. అక్కడ జరిగిన 60 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు ఖేమ్కా. మోసపూరితంగా ఫంగిసైడ్స్ ను రైతులకు అమ్మినందుకు ఓ జర్మనీ పురుగుమందుల కంపెనీపై క్రిమినల్ కేసుకు సిఫార్సు చేశారు ఖేమ్కా. దీంతో కలవరపడ్డ సర్కార్, ఆయన్ను అత్యంత అప్రాధాన్య పోస్టైన హర్యానా ఆర్కైవ్స్ కు సెక్రటరీగా బదిలీ చేసింది. ఈ ఆదేశాలు ఇంకా ఆయనకు అందకుముందే, మరో జూనియర్ అధికారిని పంపించి, బాధ్యతలను బలవంతంగా బదిలీ చేయించింది. ఏడాది కాలంలో ఖేమ్కా ట్రాన్స్ ఫర్ కావడం ఇది నాలుగోసారి. నిజాయితీగా పనిచేసే అధికారులకు మన ప్రభుత్వాలు ఇచ్చే బహుమతులు ఇలానే ఉంటాయి మరి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
