తెలంగాణ ఉద్యమ సాధనలో కీలక మలుపుగా భావిస్తున్న హైదరాబాద్ కవాతులో పొరపాటు జరిగినట్లు టీజేఏసీ చెబుతోంది. కవాతు జరిగిన తీరుపై విశ్లేషణ జరిపిన నేతలు.. మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించారు. మార్చ్ ను ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం రాత్రి 7 గంటలకు ముగించాలని ముందు భావించినా... ఒకరిద్దరు చెప్పడంతో కొనసాగించాలని ప్రకటించాల్సి వచ్చిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. చివరకు, అలా చేయడం సరికాదని భావించి అర్థరాత్రి సమయంలో హడావుడిగా మార్చ్ ను ముగించామన్నారు. అయితే.. ఆ ఒకరిద్దరు ఎవరన్నది నేతలు బయటపెట్టలేదు. పైగా, నేతలందరినీ కలుపుకోలేదన్న విమర్శను కూడా జేఏసీ గుర్తించింది. ఇకపై అందరినీ కలుపుకొని వెళ్లాలన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు.
Read more...
kodandaram లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
kodandaram లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
4, అక్టోబర్ 2012, గురువారం
తెలంగాణ మార్చ్ లో పొరపాటు జరిగిందన్న టీజేఏసీ
5, ఫిబ్రవరి 2012, ఆదివారం
సంక్రాంతి అయ్యింది.. మార్చి, ఏప్రిల్ మిగిలింది
Categories :
kcr . kodandaram . POLITICS . telangana . TOP
తెలంగాణ ఉద్యమాన్ని దఫదఫాలుగా వాయిదా వేస్తూ వస్తున్న తెలంగాణ జేఏసీ, టీఆర్ ఎస్ పార్టీలు.. ఇప్పుడు మరో కొత్త పల్లవి అందుకున్నాయి. సంక్రాంతి తర్వాత తేల్చుకుంటామంటూ డిసెంబర్ నెలలో నానా హడావిడి చేసినవాళ్లు కాస్తా.. పండుగయ్యాక ఒకే ఒక్క ధర్నాతో సరిపెట్టారు. ఇక తెలంగాణ ఉద్యమ రధసారధిగా చెప్పుకునే కేసీఆర్, చాలా వరకూ ఇంటికే పరిమితమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన బయటకు వచ్చిన కనిపించిన సంఘటనలు చాలా తక్కువ. ఇవాళ మంచిర్యాలలో పర్యటించిన కేసీఆర్.. మళ్లీ మార్చి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అయితే, పరీక్షలు ఉండే మార్చి, ఏప్రిల్ నెలలను ఎందుకు ఎంచుకుంటున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న. లేదంటే, అప్పుడు పరీక్షలను సాకుగా చూపించి వాయిదా వేస్తారేమో..? ఇప్పటికే తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీలను నమ్ముకొని సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులంతా జీతాలందక చేతులు కాల్చుకున్నారు. వారి కోసం ఏవో ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ చేయడం తప్పితే, జనం మధ్యకు వచ్చి పోరాడిన చరిత్ర ఈ పార్టీలకు లేదు. ఈ నేపథ్యంలో మరో విడత ఉద్యమం ఎలా జరుగుతుందన్నది ఊహించడం కష్టమే..
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

