టిట్ ఫర్ టాట్ - కేటీఆర్ పై ఏపీ సీఐడీ కన్ను
ఫామ్ హౌస్ లో ప్లానింగా..?
Categories :
kcr . POLITICS . telangana . vote for cash
అయితే.. కేసీఆర్ టూర్ వ్యూహాత్మకమే కావచ్చంటున్నారు విశ్లేషకులు. గతంలో ఉద్యమ సమయంలోనూ సడన్ గా మాయమయ్యేవాళ్లు కేసీఆర్. కొన్నాళ్ల విరామం తీసుకుని వచ్చి ఏదో ఓ సంచలన ప్రకటన చేసేవారు. సంచలనాత్మక నిర్ణయాలను అమలు చేసేవాళ్లు. అవన్నీ ఉద్యమానికి ఊపిరి పోసినవే. ఇప్పుడు ఈ విరామం కూడా వ్యూహాత్మకే అన్నది చాలామంది అభిప్రాయం. ఓటు కు నోటు కేసును మళ్లించే దిశగా ఆయన ఏదైనా వ్యూహరచన చేస్తుండవచ్చు. ఇప్పటికే ఈ విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, డీజీపీ అనురాగ్ శర్మలతోనూ ఫామ్ హౌస్ లోనే చర్చలు జరిపారు కేసీఆర్. ఇక నిత్యం వచ్చే రాజకీయ నాయకులతోనూ చర్చలు సాగుతున్నాయి. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తూ.. కీలక ప్రకటన ఏదైనా చేయవచ్చన్న ఊహాగానాలు టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతున్నాయి.
కేసీఆర్ కోసం కొత్త హెలికాప్టర్
Categories :
helicopter . kcr . POLITICS . telangana . TOP
ఆమె రేటు కోటి..
రికార్డు కొట్టేసిన కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు?
Categories :
ANDHRA PRADESH . chandrababu . news . seemandhra . state formation day . tdp . telangana
రాష్ట్రం విడిపోవడం సీమాంధ్ర ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి జూన్ 2 వారికి సంబంధించినంతవరకూ విద్రోహ దినమే తప్ప అవతరణ దినోత్సవం కాదు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే జూన్ 8ని కూడా అవతరణ దినోత్సవంగా స్వీకరిస్తారా లేదా అన్నదీ అనుమానమే. ఇంతవరకూ జరుపుకుంటూ వచ్చిన నవంబర్ 1 కి ఇకపై ప్రాధాన్యత ఉండనే ఉండదు. ఎందుకంటే, అది ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన సందర్భం. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ కు సంబంధించిన ఏ ప్రాంతమూ ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదు కాబట్టి, నవంబర్ 1 ఆ అర్హత కోల్పోయింది. పోనీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిన అక్టోబర్ 1ని జరుపుకుందామంటే, దానికీ ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే, అక్టోబర్ 1కి ఇప్పటి పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. దీంతో, కొత్త ప్రభుత్వం రాష్ట్ర దినోత్సవంగా దేన్ని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి పాలన ముగిసి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి, అందులోనూ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి, జూన్ 8నే చరిత్రలో మిగిలిపోయేలా చేయడానికి ఆ రోజునే అవతరణ దినోత్సవంగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, దానికి జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది.
రెండు రాష్ట్రాల్లోనూ చంద్రోదయం
తెలంగాణలో పోటాపోటీగా ఎన్నికలు జరిగాయంటూ సర్వేలు చెప్పినా, కాంగ్రెస్ నేతలు తమదే విజయం అన్నా.. ప్రజాతీర్పు మాత్రం వన్ సైడ్ గానే వచ్చింది. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ను మాత్రం పాతిక మార్కును దాటనివ్వలేదు. చాలామంది మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా చుక్కలు చూపించారు తెలంగాణ ఓటర్లు..
సీమాంధ్రలో మాత్రం రెండు రకాల తీర్పులొచ్చాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఓటర్లు టీడీపీ పక్షాన నిలిస్తే, దక్షిణ కోస్తా, అనంత మినహా రాయలసీమ మిగిలిన మూడు జిల్లాల ప్రజలు మాత్రం వైసీపీ పక్షాన నిలబడ్డారు. జిల్లాల వారీగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నడిచింది. ఎక్కడా కాంగ్రెస్ ను ఖాతా తెరవనివ్వలేదు ఆంధ్ర ఓటర్లు.జిల్లాల వారీగా బలాబలాలు
శ్రీకాకుళం (10): టీడీపీ-7, వైసీపీ-3
విజయనగరం (9): టీడీపీ-6, వైసీపీ-3
విశాఖపట్నం (15): టీడీపీ-11, వైసీపీ-3, బీజేపీ-1
తూ.గో. (19): టీడీపీ-12, వైసీపీ-5, బీజేపీ-1, ఇండిపెండెంట్-1
ప.గో. (15): టీడీపీ-14, బీజేపీ-1
కృష్ణా (16): టీడీపీ-10, వైసీపీ-5, బీజేపీ-1
గుంటూరు (17): టీడీపీ-12, వైసీపీ-5
ప్రకాశం (12): వైసీపీ-6, టీడీపీ-5, ఇండిపెండెంట్-1
నెల్లూరు (10): వైసీపీ-7, టీడీపీ-3
చిత్తూరు (14): టీడీపీ-6, వైసీపీ-8
అనంతపురం (14): టీడీపీ-12, వైసీపీ-2
కడప (10): వైసీపీ-9, టీడీపీ-1
కర్నూలు (14): టీడీపీ-3, వైసీపీ-11
ఆళ్లగడ్డలో మాత్రం దివంగత నేత శోభానాగిరెడ్డినే గెలిపించారు అక్కడి ప్రజలు. ఆమె చనిపోయినా, ఆమెకు ఓటేస్తే ఉపఎన్నికలు వస్తాయని తెలిసినా, ఓటు ద్వారా ఆమెకు నివాళులు అర్పించారు ఆళ్లగడ్డ ఓటర్లు.
సీమాంధ్రలో సైకిల్ సవారీ .. హస్తగతమైన తెలంగాణం
ఇక తెలంగాణ విషయానికి వస్తే కారు జోరుకు హస్తం అడ్డుగా నిలిచింది. మున్సిపాలిటీల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీకే దక్కి, ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. 21 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోగా, టీడీపీ రెండు, టీఆర్ఎస్ 8 మున్సిపాలిటిల్లో అధికారాన్ని అందుకున్నాయి. అయితే, ఈ సారి ఆశ్చర్యకరంగా, బీఎస్పీ రెండు మున్సిపాలిటీలను దక్కించుకోవడం విశేషం. ఎంఐఎం భైంసా మున్సిపాలిటీలో జయకేతనం ఎగరవేసింది. తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. నిజామాబాద్, రామగుండంలో హస్తం హవానే నడిచింది.
తెలంగాణలో భారీగా పోలింగ్
జిల్లాల వారీగా చూస్తే
ఆదిలాబాద్ 78%
నిజామాబాద్ 70%
కరీంనగర్ 76.02%
మెదక్ 77%
రంగారెడ్డి 60%
హైదరాబాద్ 53%
మహబూబ్ నగర్ 73%
నల్గొండ 80.56%
వరంగల్ 75%
ఖమ్మం 78%
భారీగా పోలింగ్ నమోదు కావడంతో, విజయం ఎవరిదన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజయం అంటూ బీరాలు పోతున్నాయి. అటు దేశవ్యాప్తంగానూ భారీగా పోలింగ్ నమోదయ్యింది. ఐదు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది.
దూసుకెళ్తున్న వరంగల్.. రేసులో వెనుకబడ్డ రాజధాని
వరంగల్ 37.34%
నిజామాబాద్ 37.50%
ఖమ్మం 36.97%
మహబూబ్నగర్ 35.71%
మెదక్ 34.33%
ఆదిలాబాద్ 33.96%
కరీంనగర్31.96%
నల్గొండ 23.30%
రంగారెడ్డి 26%
హైదరాబాద్ 18.03%
పాపం బ్రహ్మీ..
Categories :
election . news . POLLING . telangana . VOTE MISSING
హైదరాబాద్ వెనుకబడింది..
తెలంగాణ ముగిసింది.. ఆంధ్ర మిగిలింది
తెలంగాణలో ప్రచారానికి తెరపడుతుండడంతో సీమాంధ్రపైకి దృష్టి మళ్లించాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు కొన్ని జిల్లాల్లో ప్రచారం పూర్తి చేయగా, బాలయ్య కూడా విరామం లేకుండా ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు స్టార్ క్యాంపైనర్ గా చిరంజీవి తన పని మొదలుపెట్టారు. అన్నింటికీ మోడీ మంత్రాన్నే వల్లె వేస్తున్న బీజేపీ, సీమాంధ్రలోనూ ఆయన్నే ప్రచారానికి పిలుస్తోంది. ఏప్రిల్ 30, మే1 తేదీల్లో ఆయన సీమాంధ్రలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 30న తిరుపతిలో, మే 1న విశాఖలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక మే 2 సోనియా విశాఖ బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ సభ జరిగిన తర్వాతి రోజే సోనియా సభ జరుగుతుండడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. అటు రాహుల్తో కూడా వీలైనంతగా సభలను నిర్వహించాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
రాహుల్కు క్లారిటీ ఉందా..?
Categories :
election . made in telangana . POLITICS . rahul gandhi . telangana
ప్రస్తుతం యువకులు ధరిస్తున్న గడియారాలు, టీషర్టులు, షూలు అన్నీ మేడిన్ చైనా అన్న పేరుతో వస్తున్నాయన్నారు రాహుల్ గాంధీ. డబ్బు మనది, ఉపాధి చైనా వాళ్లదంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాటన్నింటిపైనా మేడిన్ తెలంగాణ అని వస్తుందని, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. హామీ వరకూ బాగానే ఉన్నా.. ఓ వస్తువు మీద మేడిన్ తెలంగాణ అని వేయడం కరెక్టా కాదా అన్నది రాహుల్ ఆలోచించలేకపోయారు. మన దేశంలో తయారైన ఏ ఉత్పత్తి అయినా మేడిన్ ఇండియా అనే ఉంటుంది తప్ప.. మేడిన్ ఆంధ్రప్రదేశ్, మేడిన్ మధ్యప్రదేశ్, మేడిన్ గుజరాత్ అంటూ ఉండదు. జనాన్ని ఆకర్షించడానికి మరీ ఇంతలా హామీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు.. రాహుల్ కాస్త ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకుంటే మంచిదేమో..!
తొమ్మిది దశల్లో పోలింగ్
Categories :
breaking news . election . news . POLITICS . polling dates . seemandhra . telangana
జూన్ 2న ఆవిర్భవించనున్న తెలంగాణ
Categories :
bifurcation . POLITICS . seemandhra . telangana . telangana formation day
చెయ్యికి కారు చెయ్యిస్తుందా...?
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీన పంచాయతీపై సాగుతున్న ఉత్కంఠ మరో రెండు రోజుల్లో విడిపోయే అవకాశం ఉంది. మార్చి 3న జరిగే పార్టీ పొలిట్ బ్యూరో, శాసనసభా పక్ష, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దీనిపై పార్టీ నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. అయితే, ఇప్పటివరకైతే పార్టీ నేతలెవరికీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇంతకాలం కష్టపడి ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకుని, ఫలితాలు సాధించే సమయంలో విలీనం చేయడం సరికాదంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కావాలంటే పొత్తు పెట్టుకుని సరిపెడదామని, విలీనంతో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా నష్టపోతారని కేసీఆర్ కు చెప్పుకుంటున్నారు. దీంతో, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠను కలిగిస్తోంది.
అయితే, రాజకీయ పార్టీని నిర్వహించడమన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. 15 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న కేసీఆర్ కు ఇది బాగా తెలుసు. ఇంతకాలం ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్.. తెలంగాణ ఏర్పాటుతో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారనుంది. ఉద్యమం కారణంగా ఇంతకాలం వచ్చిన విరాళాలు, నిధులు ఇకపై ఆ స్థాయిలో రాకపోవచ్చు. పైగా, ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, అధికారాన్ని దక్కించుకోలేకపోతే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దీనికి తోడు పార్టీలో ముగ్గురి మధ్య సాగుతున్న వారసత్వపోరు పార్టీకి ఇబ్బందిని కలిగించే పరిస్థితులూ ఉన్నాయి. దీంతో విలీనం చేయడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపైనే కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపిన కేసీఆర్, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. విలీనం కన్నా పొత్తుకే ప్రాధాన్యం ఇచ్చి, ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని కొంతమంది నేతలు ప్రతిపాదిస్తున్నారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మెజార్టీ స్థానాలు ఆ కూటమికే దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయంపైనే మూడో తేదీన టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో చర్చించనుంది.
పొత్తుకే సిద్ధమని కేసీఆర్ ప్రకటిస్తే మాత్రం, కాంగ్రెస్ కు అది ఆశాభంగమే. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్న హస్తం, టీఆర్ఎస్ విలీనంతో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కానీ, పొత్తుతో పోటీకి వెళ్తే మాత్రం, ఆ తర్వాత అధికారాన్ని పూర్తిస్థాయిలో దక్కించుకోవడం అసంభవం. కచ్చితంగా టీఆర్ఎస్ నేతలు ముఖ్యపదవులనే కోరుకుంటారు. దీనికి కాంగ్రెస్ నేతలూ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
సీమ, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ
Categories :
bifurcation . cabinet . POLITICS . seemandhra . tbill . telangana
అసెంబ్లీలో గెలిచిందెవరు..?
Categories :
assembly . bifurcation . parliament . POLITICS . seemandhra . t bill . telangana
చివరిరోజు ఏమవుతుందో అన్న టెన్షన్ లో అంతా ఉండగానే, ప్రక్రియను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. విభజన బిల్లుకు ఓ లక్ష్యం, ఓ ఆశయం లేదంటూ, అసలది బిల్లే కాదంటూ.. దాన్ని తిరస్కరించి పంపాల్సిందేనంటూ సీఎం కిరణ్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. కేవలం వాయిదాలకే పరిమితం అవుతోంది. బీఏసీల మీటింగులు ఎన్ని నిర్వహించినా, పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. సీఎం నోటీస్ తిరస్కరించాల్సిందేనంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించాల్సిందేనంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళనలకు దిగడంతో చర్చలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక చివరి రోజు కూడా ఇవే సంఘటనలు సభలో పునరావృతమయ్యాయి. రెండుసార్లు సభ వాయిదా వేసి, మూడోసారి సమావేశ పరిచిన స్పీకర్.. అకస్మాత్తుగా చర్చా వివరాలను ప్రకటించి, ఇంతవరకూ రికార్డైన 86 మంది ప్రసంగాలలో పాటు ఎమ్మెల్యేలు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారాన్ని, బిల్లుకు సూచించిన 9072 సవరణలను కలిపి రాష్ట్రపతికి పంపిస్తానని సభలో ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ముందు ఓటింగ్ కు ఉంచారు. మూజువాణి ఓటింగ్ ను నిర్వహించి.. తీర్మానం నెగ్గిందని చెప్పి సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక్కడే అసలు గొడవ మొదలయ్యింది.
రాష్ట్రపతి ఇచ్చిన గడువు ప్రకారం చర్చను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతోపాటే, సభ బిల్లును తిరస్కరించాలని తీర్మానించిందంటూ రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతో బిల్లుపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. అయితే, కేవలం అభిప్రాయాల కోసమే బిల్లును శాసనసభకు పంపించారు కాబట్టి, వాటినే రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. అయితే, బిల్లును తిరస్కరిస్తూ సభ తీర్మానం చేసింది కాబట్టి, పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టకూడదని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూజువాణి ఓటంటే ఏకగ్రీవ నిర్ణయంతో సమానం కాబట్టి, సభంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉందని గుర్తించాలన్నారు మంత్రి ఆనం.
సీఎం తీర్మానాన్ని సభలో నెగ్గించడం దుర్మార్గమంటూనే, చర్చ ముగిసినందుకు మాత్రం హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ నేతలు. తమకు కావాల్సింది అసెంబ్లీలో ప్రక్రియ ముగియడమేనంటున్నారు. ఢిల్లీ దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్లూ దీనికి తగ్గట్లే ఉన్నాయి. సీఎం తీర్మానంపై మాత్రమే సభ ఓటింగ్ నిర్వహించిందని, బిల్లుపై కాదంటూ ఆయన ప్రకటించారు. పైగా, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి సంక్రమించిన అధికారాలకు ఈ తీర్మానం ఏమాత్రం విఘాతం కలిగించదన్నారాయన. ఫిబ్రవరి 4న జీవోఎం సమావేశంలో అసెంబ్లీ పంపించిన అభిప్రాయాలపై చర్చించే అవకాశం ఉంది. సభ సూచించిన సవరణల్లో సహేతుకమైన వాటిని బిల్లులో పొందుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని భావిస్తున్న యూపీఏ సర్కార్కు బీజేపీ మద్దతు తప్పని సరి. అందుకే, బీజేపీ సూచిస్తున్న పోలవరానికి జాతీయ హోదా, పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడం, సీమాంధ్ర రాజధానికి నిర్ధిష్టమైన నిధుల కేటాయింపును ప్రకటించే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమైక్య తీర్మానం చేయగలిగిన సీమాంధ్ర నేతలు, ఇప్పుడు దృష్టంతా ఢిల్లీపై పెట్టారు. పార్లమెంట్లోనూ బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.





