షోరూమ్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు 11 కోట్ల రూపాయలు వసూలు చేశాడట టాలీవుడ్ టాప్ స్టార్ మహేశ్ బాబు. ఇటీవలే కూకట్ పల్లిలోని సౌతిండియా షాపింగ్ మాల్ ను ఆయన ప్రారంభించాడు. షోరూమ్ ఓపెనింగ్ కే 11 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాక్ గా మారింది. ఒక్క గంటలో అయిపోయే దానికి.. ఒక సినిమాకు తీసుకున్నంత తీసుకోవడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమాలతో పోల్చితే.. యాడ్స్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్న మహేశ్.. మరో కొత్త రికార్డు సృష్టించాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ షోరూమ్ లు ఓపెన్ చేయడం ద్వారా హీరోయిన్లే ఎక్కువ సంపాదించారు. అయితే, వాళ్లు కూడా కోటి రూపాయల మార్క్ ను దాటలేదు. ఇప్పుడు మహేశ్ ఏకంగా పదకొండు కోట్లు వసూలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
Read more...
south india shopping mall లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
south india shopping mall లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
11, అక్టోబర్ 2012, గురువారం
5, అక్టోబర్ 2012, శుక్రవారం
ప్రిన్స్ మహేశ్ ప్రారంభించిన బిల్డింగ్ సీజ్
Categories :
mahesh babu . news . seize . south india shopping mall . TOP
టాలీవుడ్ అందగాడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు అట్టహాసంగా ప్రారంభించిన హౌసింగ్ బోర్డ్ లోని సౌతిండియా షాపింగ్ మాల్ ఒక్కరోజు కూడా నడవలేకపోయింది. బిల్డింగ్ కు అనుమతులు లేవని తేల్చిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా ప్రారంభోత్సవం చేసిన సౌతిండియా షాపింగ్ మాల్ యజమానులు.. అధికారుల తీరుతో షాక్ తిన్నారు. వాస్తవానికి ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం12.35కు మహేశ్ బాబు షాపింగ్ మాల్ ను ప్రారంభించాల్సి ఉంది. కానీ, మహేశ్ వస్తున్నాడని విపరీతంగా ప్రచారం అవడంతో.. షాపింగ్ మాల్ ముందు జనం బారులు తీరారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జామ్ కారణంగా, మహేశ్ రాక ఆలస్యం అయ్యింది. ముహూర్తం దాటాక వచ్చిన ప్రిన్స్.. ఒకటింపావు సమయంలో రిబ్బన్ కట్ చేశారు. బహుశా దీని ఎఫెక్ట్ ఏమైనా పడిందో.. ఏమో.. సౌతిండియా షాపింగ్ మాల్ మూతపడింది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
