
వై.ఎస్. లోపలి మనిషి బయటకు వచ్చాడు. ఇంతకాలం కప్పుకున్న ముసుగును తొలి విడత పోలింగ్ అవ్వగానే ఆయన తీసేసారు. తెలంగాణా వస్తే రాయలసీమ వాసులు హైదరాబాద్ లో విదేశియుల్లా బతకాల్సి వుంటుందని హెచ్చరించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాయలసీమకు శ్రీశైలం నీళ్ళు రావని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వయంగా అధికారంలోకి రాలేమని భావించిన చంద్రబాబు తెరాసతో జతకట్టారని, దీంతో హైదరాబాద్ ఆంధ్ర, రాయలసీమకు కాకుండా పోతుందని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల వారు కాలేజీలు, స్కూళ్ళు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ అనుమతించరని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే రాయలసీమకు చెందిన అనేక ప్రాజెక్టులు ఆగిపోతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు.