
సామజిక న్యాయమంటూ దూసుకొచ్చిన చిరంజీవి తన మాట పూర్తిగా నేరవేర్చుకోలేక పోయారు. రెండో దశ ఎన్నికల ప్రచారం ముగుస్తున్నప్పటికి ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు ఇచ్చిన సీట్లలో ప్రచారానికీ అయన దూరంగా ఉన్నారు. ఏడు జనరల్ సీట్లలో ఎస్సి, ఎస్టీలకు టికెట్లను ఇచ్చారు. కానీ చిరంజీవిగాని, పవన్ కళ్యాణ్ గాని ఒక్కసారి కూడా ప్రచారానికీ వెళ్ళలేదు. పిఆర్పీ తొలి టికెట్ ప్రకటించిన తుపాకుల మణెమ్మ పోటి చేస్తున్న నెల్లూరు జిల్లా కోవూరు స్థానంలోను అధినేతలు ప్రచారం చేయలేదు. బహుశా చిరంజీవి దృష్టిలో ఇదే సామాజిక న్యాయమేమో... దీనిపై మీరేమంటారు.. మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని అందరితో పంచుకొండి.
