ఒకరు బాబాయి , మరొకరు అబ్బాయి. బాబాయికి అబ్బాయంటే ఎప్పుడూ పడదు. అబ్బాయేమో బాబాయి పేరును, తాతపేరును చెప్పుకుంటూ ఇండస్ట్రీలో ఎదిగాడు. ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాతకు తగ్గ మనువడిని తానేనని నిరూపించుకున్నాడు. దాంతో బాబాయి కూడా అబ్బాయితో చేతులు కలపక తప్పలేదు. అంతా సరిగ్గా జరుగుతున్న తరుణంలో నందమూరి కుటుంబంలో మళ్లీ భూకంపం వచ్చింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు విడిపోయారు. ఇప్పుడు ఎవరి బలమెంతో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. దీనికి వేదికవుతోంది.. రౌడీ రాజకీయాలకు కేంద్రమైన బెజవాడ. బాలయ్యకు తన బలం చూపించాలని ఎన్టీఆర్, జూనియర్ సత్తా ఎంతో తెలుసుకోవాలని బాలయ్య, ఇద్దరూ సిద్ధమవడంతో, ఇవాళ బెజవాడలో జరిగే ఎన్టీఆర్ టూర్ ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో యాక్సిడెంట్ అయినా వెనకడుగు వేయకుండా బెడ్ పైనే పడుకుని తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు ఎన్టీఆర్. తాత స్థాపించిన పార్టీని అధికారంలోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆయన ఆశల నెరవేరలేదు. ఎన్టీఆర్ వివాహం అయిన తర్వాత క్రమంగా పార్టీకి, అతనికి దూరం పెరుగుతూ వచ్చింది. బాలయ్య టీడీపీ లో చక్రం తిప్పుతుండడం, లోకేశ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండడంతో, ఎన్టీఆర్ ను పక్కకు తప్పించారు. కోడాలి నాని వ్యవహారంలోనూ జూనియర్ తీరుపై గుర్రుగా ఉన్న బాలయ్య, పార్టీలో ఎక్కడా ఎన్టీఆర్ పేరు వినిపించకూడదంటూ హుకూం జారీచేశారు. పామర్రులో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో కనిపించిన ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తీయించివేశారు. దీంతో బాబు పాదయాత్రలో ఎక్కడా జూనియర్ పేరన్నదే వినిపించకుండా అయిపోయింది. దీన్నంతా గమనిస్తూ టైమ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ టైగర్, దానికి బెజవాడ టూర్ ను వేదిక చేసుకున్నారు.
బెజవాడలో మల్ బార్ గోల్డ్ వారి వెడ్డింగ్ జ్యూయలరీ కార్యక్రమంలో జూనియర్ ఇవాళ పాల్గొననున్నారు. శుక్రవారం విశాఖలోనూ ఇదే తరహా కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఎక్కడా ఎలాంటి హడావుడి లేకుండా ఈ కార్యక్రమం జరిగిపోయింది. కానీ, విజయవాడ విషయానికి వచ్చే సరికి జూనియర్ ప్లాన్ మార్చారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ దాకా పెద్ద ఎత్తున అభిమానాల ర్యాలీతో రాబోతున్నారు. దాదాపు నాలుగువందలకు పైగా బైక్స్, కార్లు ఈ ర్యాలీలో పాల్గొననున్నాయి. దీనికోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఇక్కడే అసలు గొడవ మొదలవుతోంది. ఎన్టీఆర్ యాత్రలో ఎక్కడా బాలయ్య ఫోటో గానీ, టీడీపీ సింబల్ గాని లేకుండా జాగ్రత్త పడ్డారు. దారిపొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ పేరు గానీ, బాలయ్య పేరు గానీ ఎక్కడా వినిపించకూడదని అభిమానులకు ఆదేశాలు జారీ చేశారట ఎన్టీఆర్. దీంతో, ఇది కంప్లీట్ గా ఎన్టీఆర్ షోగానే జరగనుంది. ఈ దెబ్బతో తనకంటూ ప్రత్యేకంగా ఎంత బలం ఉందో నిరూపించుకోవాలనుకుంటున్నారు జూనియర్. అటు బాలయ్య కూడా ఈ టూర్ పై పెద్దగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలెవరూ జూనియర్ ర్యాలీ లో పాల్గొనడానికి వీల్లేదంటూ ఆర్డర్ వేశారట ఆయన. ఇంతకాలం తమ పేరుతోనే నెట్టుకొచ్చిన తారక్ కు సొంతగా ఎంత బలం ఉందో ఈ దెబ్బతో తేలిపోతుందంటున్నారట బాలయ్య. అటు పార్టీకి, ఇటు జూనియర్ కు సన్నిహితంగా ఉండేవాళ్లు మాత్రం ఇప్పుడు ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకుంటున్నారు. కొంతమంది కీలక నేతలు ఎందుకొచ్చిన గొడవంటూ, బెజవాడలో లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
బెజవాడలో జరుగుతున్న నందమూరి వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారోనని అటు బాలయ్య, ఇటు జూనియర్ ఫ్యాన్స్ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
war లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
war లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
16, మార్చి 2013, శనివారం
బెజవాడలో బాబాయ్ తో అబ్బాయ్ ఢీ
Categories :
balakrishna . bezawada . entertainment . ntr . POLITICS . TOP . vijayawada . war
ఒకరు బాబాయి , మరొకరు అబ్బాయి. బాబాయికి అబ్బాయంటే ఎప్పుడూ పడదు. అబ్బాయేమో బాబాయి పేరును, తాతపేరును చెప్పుకుంటూ ఇండస్ట్రీలో ఎదిగాడు. ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాతకు తగ్గ మనువడిని తానేనని నిరూపించుకున్నాడు. దాంతో బాబాయి కూడా అబ్బాయితో చేతులు కలపక తప్పలేదు. అంతా సరిగ్గా జరుగుతున్న తరుణంలో నందమూరి కుటుంబంలో మళ్లీ భూకంపం వచ్చింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు విడిపోయారు. ఇప్పుడు ఎవరి బలమెంతో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. దీనికి వేదికవుతోంది.. రౌడీ రాజకీయాలకు కేంద్రమైన బెజవాడ. బాలయ్యకు తన బలం చూపించాలని ఎన్టీఆర్, జూనియర్ సత్తా ఎంతో తెలుసుకోవాలని బాలయ్య, ఇద్దరూ సిద్ధమవడంతో, ఇవాళ బెజవాడలో జరిగే ఎన్టీఆర్ టూర్ ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో యాక్సిడెంట్ అయినా వెనకడుగు వేయకుండా బెడ్ పైనే పడుకుని తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు ఎన్టీఆర్. తాత స్థాపించిన పార్టీని అధికారంలోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆయన ఆశల నెరవేరలేదు. ఎన్టీఆర్ వివాహం అయిన తర్వాత క్రమంగా పార్టీకి, అతనికి దూరం పెరుగుతూ వచ్చింది. బాలయ్య టీడీపీ లో చక్రం తిప్పుతుండడం, లోకేశ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండడంతో, ఎన్టీఆర్ ను పక్కకు తప్పించారు. కోడాలి నాని వ్యవహారంలోనూ జూనియర్ తీరుపై గుర్రుగా ఉన్న బాలయ్య, పార్టీలో ఎక్కడా ఎన్టీఆర్ పేరు వినిపించకూడదంటూ హుకూం జారీచేశారు. పామర్రులో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో కనిపించిన ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తీయించివేశారు. దీంతో బాబు పాదయాత్రలో ఎక్కడా జూనియర్ పేరన్నదే వినిపించకుండా అయిపోయింది. దీన్నంతా గమనిస్తూ టైమ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ టైగర్, దానికి బెజవాడ టూర్ ను వేదిక చేసుకున్నారు.
బెజవాడలో మల్ బార్ గోల్డ్ వారి వెడ్డింగ్ జ్యూయలరీ కార్యక్రమంలో జూనియర్ ఇవాళ పాల్గొననున్నారు. శుక్రవారం విశాఖలోనూ ఇదే తరహా కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఎక్కడా ఎలాంటి హడావుడి లేకుండా ఈ కార్యక్రమం జరిగిపోయింది. కానీ, విజయవాడ విషయానికి వచ్చే సరికి జూనియర్ ప్లాన్ మార్చారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ దాకా పెద్ద ఎత్తున అభిమానాల ర్యాలీతో రాబోతున్నారు. దాదాపు నాలుగువందలకు పైగా బైక్స్, కార్లు ఈ ర్యాలీలో పాల్గొననున్నాయి. దీనికోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఇక్కడే అసలు గొడవ మొదలవుతోంది. ఎన్టీఆర్ యాత్రలో ఎక్కడా బాలయ్య ఫోటో గానీ, టీడీపీ సింబల్ గాని లేకుండా జాగ్రత్త పడ్డారు. దారిపొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ పేరు గానీ, బాలయ్య పేరు గానీ ఎక్కడా వినిపించకూడదని అభిమానులకు ఆదేశాలు జారీ చేశారట ఎన్టీఆర్. దీంతో, ఇది కంప్లీట్ గా ఎన్టీఆర్ షోగానే జరగనుంది. ఈ దెబ్బతో తనకంటూ ప్రత్యేకంగా ఎంత బలం ఉందో నిరూపించుకోవాలనుకుంటున్నారు జూనియర్. అటు బాలయ్య కూడా ఈ టూర్ పై పెద్దగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలెవరూ జూనియర్ ర్యాలీ లో పాల్గొనడానికి వీల్లేదంటూ ఆర్డర్ వేశారట ఆయన. ఇంతకాలం తమ పేరుతోనే నెట్టుకొచ్చిన తారక్ కు సొంతగా ఎంత బలం ఉందో ఈ దెబ్బతో తేలిపోతుందంటున్నారట బాలయ్య. అటు పార్టీకి, ఇటు జూనియర్ కు సన్నిహితంగా ఉండేవాళ్లు మాత్రం ఇప్పుడు ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకుంటున్నారు. కొంతమంది కీలక నేతలు ఎందుకొచ్చిన గొడవంటూ, బెజవాడలో లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
బెజవాడలో జరుగుతున్న నందమూరి వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారోనని అటు బాలయ్య, ఇటు జూనియర్ ఫ్యాన్స్ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 28, అక్టోబర్ 2011, శుక్రవారం
నెంబర్ 2 ఎవరు?
బొత్స సెక్రటేరియెట్ గడప ఎందుకు తొక్కడం లేదు..?
సర్కార్లో కిరణ్ తర్వాత ఎవరు?
డిప్యూటీ సీఎం కేవలం చెస్ బోర్డులో పావు మాత్రమేనా..?
రాష్ట్రంలో నెంబర్ వన్ ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చెప్పేసింది. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా నెంబర్ 2 ఎవరనే? కిరణ్ తర్వాత సర్కార్ లో కీలక వ్యక్తి ఎవరనే..? అది పీసీసీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణా? లేక, డిప్యూటీ సీఎం గా ఛాన్స్ దక్కించుకున్న దామోదర్ రాజనర్సింహనా..? ఇక్కడే ముసుగులో గుద్దులాటలు, కాంగ్రెస్కు అలవాటైన రాజకీయాలు తెరపైకి వచ్చాయి.
వైఎస్ హయాంలో నెంబర్ 2 ఎవరన్నది అందరికీ సుస్పష్టం. తన తర్వాత రోశయ్యే అంటూ వైఎస్ చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. కీలక బాధ్యతలను అప్పజెప్పారు. అందుకే వైఎస్ హెలికాప్టర్ అదృశ్యం కాగానే, రోశయ్య నేతృత్వంలో కేబినెట్ సమావేశం కాగలిగింది. ఇప్పటి విషయానికి వస్తే, కిరణ్ తర్వాత ఎవరన్నది ఆయన ఎవరికీ చెప్పడం లేదు. అలా చేస్తే, తన పదవికే ముప్పు వస్తుందన్నది ఆయన భయం కావచ్చు. సర్కార్లో మరో కుంపటి మొదలైతే తట్టుకోవడం కష్టమే. పైగా, బాధ్యతలు అప్పజెప్పడానికి రోశయ్యలాంటి పెద్దమనిషి, అజాత శతృవు కేబినెట్లో లేనేలేరు. ఎవరో ఒకరిని ఎంచుకుందామా అంటే, మంత్రుల మధ్య గ్రూపు రాజకీయాలు తలెత్తడం ఖాయం అందుకే, సీఎం ఈ విషయంలో ధైర్యం చేయలేకపోతున్నారు.
సీఎం మాట అటుంచితే, నెంబర్ 2 పోస్టుపై ఆశలు పెట్టుకున్నవారి జాబితా మాత్రం పెద్దగానే ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఈ హోదా కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. ఎలాగూ పార్టీ ప్రెసిడెంట్ ను కాబట్టి, సీఎం తర్వాత అంతా తానే అని ఫీలవుతున్నారు. ఆ సంకేతాలను మిగిలిన మంత్రులకు ఇవ్వడానికి గతంలో గాంధీభవన్లోనే మంత్రులతో మీటింగులు పెట్టారు. సీఎం నోట అధికారికంగా తన హోదాను ప్రకటించుకోవాలని ఫీలయ్యారు. మొదట్లో మిగిలినమంత్రులూ అదే జరుగుతుందనుకున్నా, సీఎం పెదవి మెదలకపోవడంతో, బొత్సను పట్టించుకోవడం మానేశారు. ఇది బొత్సలో మరింత అసంతృప్తిని రగిలించింది. అందుకే, 60 రోజులుగా ఆయన సెక్రటేరియెట్ గుమ్మం తొక్కలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరైనా, సెక్రటేరియెట్ లో జరిగిన సమావేశానికి మాత్రం రాలేదు. 40 రోజుల పాటు సమ్మె జరిగినా, సెక్రటేరియెట్కు వచ్చి సమీక్షించలేదు. చివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనను సైతం తన ఇంటినుంచే చేశారు తప్ప, సెక్రటేరియెట్కు రాలేదు. దీంతో, కేబినెట్ నుంచి బొత్సను తొలగించాలంటూ కిరణ్ గ్రూప్ హైకమాండ్ పై ఒత్తిడి తెస్తోంది.
ఇక డిప్యూటీ సీఎంగా దామోదర రాజనర్సింహ ఎంపికైనా, ఆయనకు దక్కిన బాధ్యతలు అంతంతమాత్రమే. సీఎం వెళ్లడానికి ఇబ్బందికరమైన పరిస్థితులున్న చోటకు మాత్రమే ఆయన వెళ్లగలుగుతున్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహించారు. అంతటితోనే ఆయన పని అయిపోయింది. చివరకు తనంతట తాను నిర్ణయం తీసుకోలేని పరిస్థితి డిప్యూటీ సీఎంది. ఉద్యోగుల డిమాండ్లన్నింటికీ సీఎం ఆమోదం తెలిపితే తప్ప సమ్మె విరమణ జరగలేదు. అంతేకాదు.. రాజనర్సింహ నెంబర్ 2 అంటే ఎవరూ లెక్కచేసే పరిస్థితి లేదు. ఆయనకు పదవి దక్కడంపైనే మిగిలిన మంత్రుల్లో అసంతృప్తి రగులుతోంది. అందుకే, డిప్యూటీ దక్కినా నెంబర్ 2 అన్న సంకేతాలను సీఎం ఇంతవరకూ ఇవ్వలేదు. చెప్పాలంటే... సర్కార్లో ఇప్పుడు ఒకే ఒక్క నెంబర్ ఉంది.. అదే నెంబర్ వన్.. కిరణ్ కుమార్.. మరో నెంబర్ ను తన వెనుక ఎదిగేలా చేయాలనుకోవడం లేదు కిరణ్ కుమార్.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
