26, అక్టోబర్ 2013, శనివారం
అహంకారానికి..ఆత్మగౌరవానికి పోరాటం:జగన్
Categories :
bifurcation . jagan . lb stadium meeting . POLITICS . samaikya shankaravam . ysrcp
రాష్ట్ర విభజన అంశం ఢిల్లీ పెద్దల అహంకారానికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని వర్ణించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. ఎల్.బి.స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఆయన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. సోనియా గాంధీకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుసా ఆని ఆయన ప్రశ్నించారు.. భారత దేశ పౌరసత్వం తీసుకున్న సోనియాను వాళ్ల దేశానికి వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతారా అని అడిగారు జగన్. నీ కొడుకును ప్రధానిని చేయడానికి మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం న్యాయం కాదని సోనియాను ఉద్దేశించి అన్నారాయన. కర్నాటక నుంచి ఇప్పటికే నీళ్లు రావడం లేదని, ట్రిబునల్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారాయన. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉందన్న్నారు జగన్. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎన్నికల వరకూ పోరాడుదామని, అప్పటికీ సాధ్యం కాకపోతే 30 ఎంపీ సీట్లను గెలుచుకుందామని.. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం.. ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దామన్నారు వైసీపీ అధినేత. చంద్రబాబు ప్యాకేజీల పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు జగన్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి