రాజ్యాంగంలో కులాల ప్రాతిపదినక రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం వెనుక ఎంతో సదుద్దేశం ఉంది. అణగారిన, బలహీన వర్గాల ప్రజలకు రాజకీయంగా, అధికారాల పరంగా పైకి తీసుకురావడానికి, అదే సమయంలో అలా పైకి వచ్చినవారి ద్వారా వారి కులాల వారి అభివృద్ధికి కృషి చేయడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ రిజర్వేషన్లను రాజ్యాంగంలో చేర్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆరు దశాబ్దాలుగా ఈ రిజర్వేషన్లు అమలువుతున్నా, ఇప్పటీకీ దళిత కులాలు అలానే ఉన్నాయి, వాళ్లలో పేదరికమూ అలానే ఉంది. ఏదో కొద్ది మంది రాజకీయంగా పైకి వచ్చినా, తమ కులాలను అభివృద్ధి చేయడానికి మాత్రం ప్రయత్నించలేదు.
అదలా ఉంచితే, పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలు చేస్తున్న రిజర్వేషన్ల ప్రకియ నవ్వు తెప్పించేలానే ఉంది. ఒకే ఒక్క ఎస్సీ కుటుంబం ఉన్న గ్రామంలోనూ సర్పంచ్ పదవి ఎస్సీకే రిజర్వ్ అయ్యింది. గుంటూరు జిల్లాలో ఒకే ఒక్క మనిషి (బిచ్చగత్తె అని వార్తల్లో వచ్చింది) ఉన్న చోట కూడా ఇదే సీన్. వాస్తవానికి ఎస్సీలు ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రం అక్కడి సర్పంచ్ పదవులు అగ్రకులాలకే దక్కాయి. ఒకే ఒక్క మహిళో, ఒకే ఒక్క కుటుంబమో ఉన్న చోట సర్పంచ్ పదవిని రిజర్వ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా.. దానివల్ల రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరుతుందా.. పైగా, ఐఏఎస్ లు , గ్రూప్ వన్ అధికారుల్లాంటి వాళ్లు దీనికోసం ఎంతో కసరత్తు చేసి, ఎన్నో లెక్కలు వేసి, ఎంతో సమయం తీసుకుని మరీ రిజర్వేషన్ల లిస్ట్ తయారు చేశారు. దాన్ని ప్రభుత్వ పెద్దలు చూసి ఆమోదించారు. అయినా, ఇలాంటి జాబితా తయారు కావడం మన వాళ్ల పరిపాలన దక్షతకు నిదర్శనం.
5, జులై 2013, శుక్రవారం
ఇవేమి రిజర్వేషన్లు బాసూ..!
Categories :
election . panchayat election . POLITICS . reservations . state . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పోదురూ, మీకర్థం కాని ది ఇందులో ఉంది - ఒకే ఒక్కరు ఉంటే unanimous గా ఎలెక్ట్ అవ్వచ్చు గదా ! ఆ పాటి అర్థం చేసు కోరూ !!
జిలేబి