1, జులై 2013, సోమవారం
స్పీడ్ పెంచిన సీమాంధ్ర నేతలు
Categories :
congress . digvijaysingh . POLITICS . seemandhra . telangana . TOP
కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సీమాంధ్ర నేతలు ఇక సైలెంట్ గా ఉంటే లాభం లేదని డిసైడ్ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల స్పీడ్ ను పెంచాలని నిర్ణయించారు. మంత్రి శైలజానాథ్ ఇంట్లో సమావేశమైన సీమాంధ్ర నేతలు, దిగ్విజయ్ వ్యాఖ్యల అర్థంపై తీవ్రంగా చర్చించారు. ఓ రకంగా రాష్ట్ర విభజన జరుగుతుందన్న సంకేతాలనే దిగ్విజయ్ ఇచ్చారని వారంతా నిర్ధారణకు వచ్చారు. రాష్ట్రం విడిపోతే కష్టమని, దీనివల్ల ప్రధానంగా నీటి సమస్యలు తలెత్తుతాయంటూ ఐదు పేజీల నివేదికను తయారు చేసి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో దిగ్విజయ్ సింగ్ కు సమర్పించారు. నదుల విషయంలో, శ్రీశైలం, సుంకేశుల, రాజోలిబండ లాంటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపిణీ విషయంలో తీవ్రమైన సమస్యలు వస్తాయని ఆయనకు వివరించారు. శ్రీకృష్ణ కమిటీ చేసిన ప్రతిపాదన్నల్లో అత్యత్తమమైన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దానికే మొగ్గుచూపాలని కోరారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి