30, జూన్ 2013, ఆదివారం
శైలజానాథ్ అయినా మాట మార్చాల్సిందేనట!
Categories :
congress . kavuri . POLITICS . seemandhra . SHAILAJANATH . telangana . TOP
పదవి వస్తే ఎవరైనా మాట మార్చాల్సిందేనని సెలవిచ్చారు కేంద్రమంత్రి కావూరి. ఇప్పుడు సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న రాష్ట్ర మంత్రి శైలజానాథ్, పీసీసీ అధ్యక్షుడైతే సమైక్యవాదాన్ని వినిపించలేరన్నారాయన. రాష్ట్రం మొత్తానికి బాధ్యత వహించేలా ఆయన ప్రవర్తించాల్సి ఉంటుందన్నారు. కేంద్రమంత్రిగా తాను కూడా రాష్ట్ర ప్రయోజనాలను విశాల ధృక్పథంతో చూడాల్సి ఉంటుందన్నారు. తన మాటలను మీడియా వక్రీకరించిందంటూ ఆక్రోశించిన కావూరి.. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్నారు. ఏదో నిన్నా మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నేతలు అవగాహనాలేమితోనో, అనుభవరాహిత్యంతోనే మాటలు మార్చారంటే అర్థం ఉంది కానీ, రాష్ట్రంలోనే అత్యంత సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్నవారిలో ఒకడైన, మూడు దశాబ్దాలుగా రాష్ట్రరాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న కావూరి పదవి రాక ముందు ఒకలా, పదవి వచ్చాక మరోలా మాట్లాడడమే కాంగ్రెస్ వర్గాలను, ముఖ్యంగా సీమాంధ్ర నేతలను విస్మయానికి గురిచేస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి