30, జూన్ 2013, ఆదివారం
కేవలం వాళ్లే అడ్డుపడుతున్నారట!
సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తని, డిసెంబర్ 9 న చేసిన ప్రకటనకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చే్స్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ. సోనియాను అత్యంత సన్నితంగా చూసిన తనకు, ఆమె మనస్తత్వం తెలుసన్నారాయన. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన సర్వే, తెలంగాణ ఏర్పాటును సీమాంధ్ర ప్రజలెవరూ వ్యతిరేకించడం లేదన్నారు. ఒకవేళ వ్యతిరేకించి ఉంటే, 2004లో తాము టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఓట్లు వేసే వారే కాదన్నారు. 2009లో తెలంగాణ ఇస్తామని చెప్పినా మరోసారి ఓట్లు వేశారన్నారాయన. కేవలం కొంతమంది వ్యాపారవేత్తలు, హైదరాబాద్ లో ఆస్తులున్నవాళ్లు, రాజకీయనాయకులు, అవకాశం వస్తే సమైక్య రాష్ట్రానికి సీఎం అవుతామని అనుకుంటున్నవాళ్లు మాత్రమే తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు సర్వే సత్యనారాయణ. అయితే, పదవుల కోసం అలా తెలంగాణకు అడ్డుపడుతున్నవారెవరన్నది మాత్రం సర్వే చెప్పలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి