5, అక్టోబర్ 2012, శుక్రవారం
తిండి విషయంలో బాబు జాగ్రత్తలు
Categories :
babu food . chandrababu . padayatra . tdp . TOP
తన రాజకీయ జీవితంలో సుదీర్ఘ ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం కప్పు ఓట్లు, రెండు ముక్కల శాండ్ విచ్, రెండు గుడ్ల తెల్ల సొనతో వేసిన ఆమ్లెట్ తీసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు సోయా పాలు తాగుతున్నారు. మధ్యాహ్నం భోజనంలో అరకప్పు రాగిసంకటి, కప్పు బీరకాయ కూర, కప్పు పాలక్ పన్నీర్, కప్పు పెరుగు తింటున్నారు. రాత్రికి గోధుమ రవ్వ ఉప్మా, వేరుశెనగ చట్నీ, పచ్చసొన లేకుండా ఆమ్లెట్, ఓ గ్లాసు పాలు, పండ్లు తీసుకుంటున్నారు. నడుస్తున్న సమయంలో కీరారసం గానీ, మజ్జిగా కానీ తాగుతున్నారు. ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో నాలుగు రోజులుగా నడుస్తున్నా.. బరువు ఏమాత్రం తగ్గలేదు. ఇదే పద్దతిని కంటిన్యూ చేస్తే, జనవరి 26 వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, షూలు వాడుతూ నడవడం వల్ల కాలి బొటనవేలికి బొబ్బలు వచ్చాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది.
దండోరా వాయించిన బాబు
ప్రజలతో కలిసి సాగుతున్న చంద్రబాబు, వారిని ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం నాడు... పొలం దున్నడంతో పాటు, దండోరా వాయించారు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి