5, అక్టోబర్ 2012, శుక్రవారం
క్విడ్ ప్రో కో: సోనియా అల్లుడికి డీఎల్ఎఫ్ సొమ్ములు
కేంద్ర రాజకీయాల్లో ప్రకంపనాలు మొదలయ్యింది. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్, సోనియా అల్లుడికి అప్పనంగా 70 కోట్ల మేర అప్పు ఇచ్చిందంటూ, సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా రుణం తీసుకున్న రాబర్ట్ వాద్రా.. డీఎల్ఎఫ్ కంపెనీకి చెందిన ఎంతో విలువైన భవనాలనే కారు చౌకగా కొన్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు 50 లక్షల రూపాయల వరకే ఆస్తులున్న వాద్రా.. ఇప్పుడు 300 కోట్లకు అధిపతి అన్నారాయన. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న హర్యానా, ఢిల్లీలో డీఎల్ ఎఫ్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే.. వాద్రా ఖాతాకు నిధులు మళ్లాయన్నారు. ఇదంతా అవినీతిలో భాగమే అన్నారు. కేజ్రీవాల్ విమర్శలకు నేరుగా సోనియానే ఖండన విడుదల చేశారు. వాద్రాకు, ఈ ఆరోపణలకు సంబంధం లేదన్నారు. ఆయన ఓ వ్యాపారవేత్త అని, అతన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. అటు బీజేపీ ఈ విషయంపై ఘాటుగానే స్పందించింది. కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణకు డిమాండ్ చేస్తోంది.
వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ అప్పనంగా సంపాదించారని జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సొంతింటి అల్లుడు పై ఎలా స్పందిస్తుందో.. జగన్ కు సుప్రీం బెయిల్ కూడా తిరస్కరించిన నేపథ్యంలో వాద్రా కేసు.. వైఎస్సార్ సీపీ చేతికి మంచి అస్త్రంలా దొరికినట్లయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి