11, అక్టోబర్ 2012, గురువారం
రిబ్బన్ కట్ చేయడానికి రూ.11 కోట్లట!
Categories :
entertainment . mahesh babu . south india shopping mall . tollywood . TOP
షోరూమ్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు 11 కోట్ల రూపాయలు వసూలు చేశాడట టాలీవుడ్ టాప్ స్టార్ మహేశ్ బాబు. ఇటీవలే కూకట్ పల్లిలోని సౌతిండియా షాపింగ్ మాల్ ను ఆయన ప్రారంభించాడు. షోరూమ్ ఓపెనింగ్ కే 11 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాక్ గా మారింది. ఒక్క గంటలో అయిపోయే దానికి.. ఒక సినిమాకు తీసుకున్నంత తీసుకోవడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమాలతో పోల్చితే.. యాడ్స్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్న మహేశ్.. మరో కొత్త రికార్డు సృష్టించాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ షోరూమ్ లు ఓపెన్ చేయడం ద్వారా హీరోయిన్లే ఎక్కువ సంపాదించారు. అయితే, వాళ్లు కూడా కోటి రూపాయల మార్క్ ను దాటలేదు. ఇప్పుడు మహేశ్ ఏకంగా పదకొండు కోట్లు వసూలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి