16, అక్టోబర్ 2013, బుధవారం
అతను ప్రధానైతే అంతకన్నా సంతోషముండదంట
కమల కురువృద్ధుడు అద్వానీ తన మనసు పూర్తిగా మార్చుకున్నారు. నరేంద్ర మోడి అభ్యర్థిత్వాన్ని ఇంతకాలం వ్యతిరేకిస్తూ వచ్చిన అద్వానీ, ఇప్పుడు మోడీ ప్రధాని అయితే తనకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఉండదని చెప్పుకొచ్చారు. మోడితో కలిసి గుజరాత్లోని అహ్మదాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత.. ఈ విషయాలను చెప్పారు. దీనిద్వారా తనకు,మోడికి మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పడానికి ప్రయత్నించారాయన. సబర్మతి రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన గార్డెన్స్ ను ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన సభలో అద్వానీ, మోడిలు కలిసి పాల్గొన్నారు. 2011 తర్వాత గుజరాత్ లో ఓ బహిరంగ సభలో ఇద్దరూ కలిసి పాల్గొనడం ఇదే తొలిసారి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి