నెల రోజుల క్రితం జైపూర్లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్లో ఆవేశంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి షిండే ఎట్టకేలకు మెట్టుదిగారు. బీజేపీ, ఆరెఎస్సెస్ శిబిరాలు హిందూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, దీనిపై తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందన్న షిండే.. బడ్జెట్ సమావేశాలకు ముందు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఏదో ఓ మతానికి ముడిపెట్టడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడినవారికి పశ్చాతాపాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ.. ఓ లేఖను విడుదల చేశారు షిండే.
నెలరోజులగా ఈ విషయంపై నోరు మెదపకుండా ఉన్న హోంమంత్రి ఇప్పుడు సడన్గా పశ్చాతాప పడడానికి పెద్ద కారణమే ఉంది. బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించడం కోసం లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఈ వ్యవహారాన్ని లేవనెత్తింది. షిండే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్. తమ పార్టీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంటే, తనను, తమ పార్టీ ఎంపీలను సభలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకోవాలన్నారామె. అఖిలపక్ష సమావేశం పూర్తైన తర్వాత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్, సుష్మాస్వరాజ్తో ప్రత్యేకంగా సమావేశమై సంధియత్నాలు చేశారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో షిండే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సభలో ఇదేవిషయంపై ఆయన ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
హిందూ ఉగ్రవాద వ్యాఖ్యలపై షిండే చింతిస్తున్నానని ప్రకటించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. హోంమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. వివాదం పరిష్కారం కావడంతో, బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని పేర్కోంది కమలం పార్టీ. షిండేకు, బీజేపీకి మధ్య వివాదం పరిష్కారం కావడంపై ఎన్డీఏ పక్షాలు కూడా సంతృప్తిని వ్యక్తం చేశాయి.
hindutva terrorism లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
hindutva terrorism లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
21, ఫిబ్రవరి 2013, గురువారం
తప్పైపోయిందన్న కేంద్ర హోంమంత్రి షిండే
నెల రోజుల క్రితం జైపూర్లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్లో ఆవేశంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి షిండే ఎట్టకేలకు మెట్టుదిగారు. బీజేపీ, ఆరెఎస్సెస్ శిబిరాలు హిందూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, దీనిపై తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందన్న షిండే.. బడ్జెట్ సమావేశాలకు ముందు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఏదో ఓ మతానికి ముడిపెట్టడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడినవారికి పశ్చాతాపాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ.. ఓ లేఖను విడుదల చేశారు షిండే.
నెలరోజులగా ఈ విషయంపై నోరు మెదపకుండా ఉన్న హోంమంత్రి ఇప్పుడు సడన్గా పశ్చాతాప పడడానికి పెద్ద కారణమే ఉంది. బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించడం కోసం లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఈ వ్యవహారాన్ని లేవనెత్తింది. షిండే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్. తమ పార్టీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంటే, తనను, తమ పార్టీ ఎంపీలను సభలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకోవాలన్నారామె. అఖిలపక్ష సమావేశం పూర్తైన తర్వాత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్, సుష్మాస్వరాజ్తో ప్రత్యేకంగా సమావేశమై సంధియత్నాలు చేశారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో షిండే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సభలో ఇదేవిషయంపై ఆయన ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
హిందూ ఉగ్రవాద వ్యాఖ్యలపై షిండే చింతిస్తున్నానని ప్రకటించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. హోంమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. వివాదం పరిష్కారం కావడంతో, బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని పేర్కోంది కమలం పార్టీ. షిండేకు, బీజేపీకి మధ్య వివాదం పరిష్కారం కావడంపై ఎన్డీఏ పక్షాలు కూడా సంతృప్తిని వ్యక్తం చేశాయి.
9, ఫిబ్రవరి 2013, శనివారం
షిండే ఆనాటి మాటల వెనుకున్న లెక్క ఇదేనా!
Categories :
afzal guru . death . hindutva terrorism . POLITICS . shinde . TOP
రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరులే అంటే.. ఇదే కాబోలు. పైకి మాట్లాడేది ఒకటైతే.. లోపల జరిగేది మరొకటి. మన రాజకీయాలను, మన పొలిటికల్ లీడర్లను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. తాజాగా అఫ్జల్ గురును ఉరి తీసే విషయంలోనూ ఇదే జరిగింది. హిందుత్వ ఉగ్రవాదంపై కామెంట్లు చేసి.. దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించిన షిండే.. అదే సమయంలో ఆఫ్జల్ గురును ఉరి తీసే ఫైల్పైనా సంతకం చేయడమే... యూపీఏ పొలిటికల్ స్ట్రాటజీకి అద్దం పడుతోంది.
పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి సూత్రధారి ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష వ్యవహారాన్ని చాపకిందనీరులా చక్కబెట్టారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడంకోసం మరో తేనెతుట్టెను కదిపారాయన. ఆఫ్జల్ గురు కు క్షమాభిక్ష తిరస్కరిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న జనవరి 21కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతకు ముందు మూడు రోజుల పాటు, జైపూర్లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబర్ను నిర్వహించింది. చివరి రోజు అంటే.. జనవరి 20న షిండే హిందుత్వ ఉగ్రవాదంపై వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్త దుమారాన్ని సృష్టించారు. బీజేపీ , ఆరెస్సెస్లు ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నాయని, హిందుత్వ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయనీ చింతన్ శిబిర్లో ఆరోపించారు షిండే. పైగా, నిఘా వర్గాల సమాచారమూ తమ దగ్గర ఉందని దాన్ని సమర్థించుకున్నారు.
షిండే వ్యాఖ్యలపై హిందుత్వవాదులు విరుచుకుపడ్డారు. ఆర్ఎస్సెస్, బీజేపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. షిండేను పదవినుంచి దింపాలంటూ డిమాండ్ చేశాయి. జైపూర్లో హిందుత్వ ఉగ్రవాద చిచ్చు రగిలించి.. ఢిల్లీకి చేరుకున్న షిండే.. చాలా ప్రశాంతంగా జనవరి 21న ఆఫ్జల్ గురును ఉరితీయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. ఫైల్పై సంతకం చేసి రాష్ట్రపతికి పంపించారు.
హిందుత్వ ఉగ్రవాదం విమర్శలు చేసిన మరుసటి రోజే.. ఆఫ్జల్ గురును ఉరి తీయాలని షిండే ఎందుకు డిసైడ్ అయ్యారన్నదే ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఆఫ్జల్ గురును ఉరితీయాలని ముందే డిసైడ్ అయిన షిండే, ఆ పని చేస్తే, మైనార్టీల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత వస్తుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే, దేశంలో హిందుత్వ ఉగ్రవాదం రాజ్యమేలుతోందంటూ విమర్శలు చేశారు. అటు హిందుత్వ ఉగ్రవాదం ఉందని ప్రకటించడం.. ఇటు ఆఫ్జల్ గురును ఉరి తీయమని సంతకం చేయడం.. రెండింటికీ లెక్క సరిపోయిందనుకున్నారాయన. హిందుత్వ ఉగ్రవాదంపై మాట్లాడినందుకు మైనార్టీల్లోనూ.. ఆఫ్జల్ను ఉరితీయడం వల్ల మిగిలిన వర్గాల్లోనూ కాంగ్రెస్కు ఇమేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు షిండే.
Read more...
4, ఫిబ్రవరి 2013, సోమవారం
హోంమంత్రి షిండే పైనా కేసు పెట్టారు
Categories :
case . hindutva terrorism . POLITICS . shinde . TOP
నోటి దురుసుతో తిప్పలు పడుతున్న వారి జాబితాలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చేరారు. హిందుత్వ ఉగ్రవాదం అంటూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో వ్యాఖ్యానించిన షిండేపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఎక్కడా కేసులు మాత్రం నమోదు కాలేదు. పైగా, బీజేపీ కూడా షిండే ను తప్పించాలంటూ తీవ్రంగా ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని మధురలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో కేసు నమోదు చేశారు. సాహెబ్ సింగ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై ఈ నెల 12న విచారణ జరపనుంది కోర్టు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
