ఎంత గొప్పవారైనా పన్నులు కట్టాల్సి వచ్చే సరికి నిర్లక్ష్యం చేస్తారన్న విషయం మరో సారి రుజువయ్యింది. క్రికెట్ లో ఎన్నో ఉన్నత శిఖరాలధిరోహించి, ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచి, ఇటీవలే దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకూ ఎంపికైన సచిన్.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు మాత్రం నీటి బిల్లు కట్టడం లేదట. ఇటీవల బకాయిదారుల జాబితాను తయారు చేసిన మున్సిపల్ కార్పొరేషన్, ఆ జాబితాను వెబ్ సైట్లో పెట్టింది. ఈ లిస్ట్లో 44800 నెంబర్లో ఉన్న సచిన్, అంజలి కార్పొరేషన్ కు రూ.16640 బకాయి పడ్డట్లు ఉంది.
సచిన్ తో పాటు ఎంతోమంది ప్రముఖులు ఈ లిస్ట్ లో ఉన్నారు. శివ సేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే కుటుంబం, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంతులే.. కూడా ఇలా బకాయిదారుల్లో ఉన్నారు. 9912 పేజీల ఈ డాక్యుమెంట్లో మొత్తం 201908 మంది డిఫాల్టర్స్ ఉన్నారు. కార్పొరేషన్ కు వసూలు కావాల్సిన నీటి బిల్లుల మొత్తం వెయ్యా 71 కోట్లకు పైగానే ఉంది.
కామెంట్ను పోస్ట్ చేయండి