30, నవంబర్ 2013, శనివారం
బాబు కోటలో జగన్
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఇదే కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. బెయిల్ వచ్చిన తర్వాత రాజకీయయాత్రకు ఇవాళ్టి నుంచి శ్రీకారం చుడుతున్న ఆయన, దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచే మొదలుపెడుతున్నారు. కాంగ్రెస్ కన్నా తెలుగుదేశంతోనే తమకు ఎక్కువ పోటీ ఉంటుందని భావిస్తున్న జగన్, వ్యూహాత్మకంగా కుప్పంనుంచే సమైక్య శంఖారావాన్ని ప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే చంద్రబాబు కుప్పంలో పర్యటించి రావడం, లోకేశ్ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యంలో, జగన్ యాత్ర ఎలా సాగుతుందన్నది రాజకీయవర్గాల్లో ఉత్కంఠ సృష్టిస్తోంది. జగన్ యాత్రకు ఎలాంటి స్పందన వస్తుందోనని టీడీపీ నేతలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే, కుప్పంలో సాగుతున్న ఈ యాత్రను విజయవంతం చేయడానికి చిత్తూరు జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు కంకణం కట్టుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి