18, నవంబర్ 2013, సోమవారం
21నే తేలిపోతుందట
తెలంగాణపై కేంద్రమంత్రుల అభిప్రాయ సేకరణ నేటితో ముగిసింది. ముఖ్యమంత్రి, తెలంగాణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై వారి వాదనలను వింది జీవోఎం. ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా సేకరించిన సమాచారంతో పాటు, రాజకీయ పార్టీలు వెలుబుచ్చిన అభిప్రాయాలు, అధికార వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా విభజన ఎలా చేయాలన్నదానిపై ముసాయిదాను తయారు చేయనుంది జీవోఎం. ఈ నెల 21న చివరిసారిగా సమావేశం కానున్న మంత్రుల బృందం అదేరోజు ముసాయిదాను రూపొందిస్తుంది. ఆ రోజే జరిగే, కేంద్ర కేబినెట్ ముందు దీన్ని ప్రవేశపెట్టనుంది. దాన్ని కేబినెట్ ఆమోదించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తైతే త్వరలోనే జరగనున్న శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ సమావేశాల్లోనే బిల్లును పెడతామని కేంద్ర హోంశాఖ కూడా స్పష్టం చేసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి