16, అక్టోబర్ 2013, బుధవారం
కంగారూలకే కంగారెత్తిపోయింది
Categories :
CRICKET . india vs australia . india won . jaipur one day . record chase . rohit sharma . shikar dhawan . TOP . virat kohli
కుర్రాళ్ల కుమ్ముడికి కొండత లక్ష్యం కరిగిపోయింది. జైపూర్ లో ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో ముందు ఆస్ట్రేలియా 359 పరుగుల భారీ స్కోర్ చేయగా, దాన్ని అత్యంత వేగంగా ఛేజ్ చేసింది టీమిండియా. ఎవరి ఊహలకూ అందనట్లుగా, 43.3 ఓవర్లలోనే అధిగమించింది ధోనీసేన. అత్యంత ఉత్కంఠగా సాగిన వన్డే మ్యాచ్లో బ్యాటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆస్ట్రేలియా బౌలింగ్ ను చితక్కొట్టారు ధావన్. రోహిత్ శర్మ. పరుగులవేటను ధావన్ మొదలుపెడితే, అదే రూట్ ను ఫాలో అయ్యాడు రోహిత్. అయితే, దురదృష్ణవశాత్తూ 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు శిఖర్ ధావన్. అప్పటివరకూ వికెట్ కోసం ఆపసోపాలు పడిన ఆస్ట్రేలియన్లలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. అయితే, ధావన్ ను ఔట్ చేసి చాలా పెద్ద తప్పు చేశామన్న సంగతి మరికాసేపటికే వారికి తెలిసొచ్చింది. ధావన్ ప్లేస్ లో క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ.. వీరకుమ్ముడు మొదలుపెట్టాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. 52 బంతుల్లో సెంచరీని చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. అటు రోహిత్ శర్మ కాస్త నిలకడగా ఆడుతూ మూడేళ్ల తర్వాత మళ్లీ సెంచరీ కొట్టాడు. వన్డేల్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోర్ ను నమోదు చేశాడు. ధావన్, రోహిత్, కోహ్లీల దెబ్బకు భారత్ స్కోర్ పరుగులు పెడుతూ 43.3 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక లక్ష చేధన. భారీ స్కోర్ చేశాంలే ఇక తిరుగులేదనుకున్న బెయిలీ టీమ్కు.. కంగారెత్తిపోయేలా బ్యాటింగ్ చేసి, ఈ సరికొత్త రికార్డును సృష్టించారు భారత కుర్రాళ్లు. మ్యాచ్ అయిపోయాకే, తనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని ఆసీస్ కెప్టెన్ బెయిలీ అన్నాడంటే, మనోళ్ల కుమ్ముడు ఏరేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఫామ్ ను వచ్చే మ్యాచ్ల్లోనూ కొనసాగించాలని కోరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి