అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరవేస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 27న మీడియా సమావేశం పెట్టారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధినాయకత్వం పచ్చజెండా ఊపిన తర్వాత సీఎం నిర్వహించిన రెండో తిరుగుబాటు మీడియా సమావేశం ఇది. రాష్ట్రం విడిపోవడం వల్ల వచ్చే సమస్యలను ఈ సమావేశంలో ఏకరువు పెట్టారాయన. ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే కుదరదని, ప్రజా నిర్ణయానికే తలొగ్గాలని ఆయన ప్రకటించారు. ఆయన చెప్పిన వాటిలో వాస్తవాలున్నాయని సీమాంధ్ర ఉద్యమకారులు, అన్నీ అవాస్తవాలేనంటూ తెలంగాణ వాదులు వాదోపవాదాలు చేసుకున్నారు. ఇందులో ఎవరు నెగ్గుతారన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు తేల్చలేం. అయితే, సీఎం మీడియా సమావేశం ఆధారంగా మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ చిన్న న్యూస్ కటింగ్ మాత్రం నన్ను విశేషంగా ఆకట్టుకొంది. ఆ న్యూస్ కటింగ్ ను ఈ పోస్ట్ లో అతికిస్తున్నాను.
సెప్టెంబర్ 28,2013న ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త |
కామెంట్ను పోస్ట్ చేయండి