17, సెప్టెంబర్ 2013, మంగళవారం
సాంబయ్యకు సమైక్య సెగ
Categories :
congress . kavuri . POLITICS . samaikya protest . TOP . west godavari
ఒకప్పుడు సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కావూరి సాంబశివరావుకు ఇప్పుడు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. సమైక్య ఉద్యమం మొదలైన తర్వాత తొలిసారిగా సొంతజిల్లాలో పర్యటించడానికి వెళ్లిన కావూరికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు సమైక్యవాదులు. కలపర్రు చెక్ పోస్ట్ దగ్గర ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో అధికార వాహనాన్ని వదిలి ప్రైవేటు వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కావూరి వస్తున్నాడన్న సమాచారంతో ఏలూరిలోని ఆయన క్యాంప్ కార్యాలయాన్ని పెద్దఎత్తున సమైక్యవాదులు ముట్టడించారు.. అయితే, ఏలూరు రాకుండా నేరుగా ద్వారకాతిరుమల వెళ్లిపోయారు కావూరి. అక్కడి నుంచి భీమవరం వెళ్లాల్సి ఉంది. కావూరిని జిల్లాలో తిరగనివ్వమని సమైక్యవాదులు చెప్పడంతో, ప్రతీచోటా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు, ముందు జాగ్రత్తగా జిల్లాలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి