1, ఆగస్టు 2013, గురువారం
ఆరునెలల్లో తెలంగాణ
సీమాంధ్రలో ఎన్ని ఆందోళనలు జరిగినా, తెలంగాణ విషయంలో వెనకడుగు వేసేదే లేదని విస్పష్టంగా ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే. తెలంగాణ బిల్లును తయారు చేసే పనిలో హోంశాఖ ఉందన్న ఆయన, సమయం తక్కువగా ఉండడంతో ఈ సెషన్లో బిల్లును ప్రవేశ పెట్టలేమన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తెలంగాణ బిల్లును తీసుకువస్తామన్నారు షిండే. ఈలోగా అసెంబ్లీలో తీర్మానం, ఇతర వ్యవహారాలను పూర్తి చేస్తామన్నారు. గతంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటైనప్పటికీ, రాష్ట్ర విభజనకు అదే ప్రాతిపదికను అనుసరించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు హోంమంత్రి. తెలంగాణ ఏర్పాటు వ్యవహారమంతా ఆరునెలల్లోపే పూర్తవుతుందని చెప్పారు షిండే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి