30, జులై 2013, మంగళవారం
పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
Categories :
ANDHRA PRADESH . congress . POLITICS . seemandhra . telangana . TOP
తెలంగాణకు ఓటేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజనకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. సుదీర్ఘకాలంగా ఉన్న తెలంగాణ డిమాండ్ ను తాము ఆమోదిస్తున్నామని, పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తున్నామని ప్రకటించింది. అయితే, రెండు ప్రాంతాల్లోని ప్రజలు, ఒక ప్రాంతంలో ఉంటున్న మరో ప్రాంత ప్రజలకు(సెటిలర్లు) ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటామని తెలిపింది. పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని డిసైడ్ చేసింది కాంగ్రెస్. ఈ పదేళ్లలో సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేస్తామని తెలిపింది. నిర్ణీత కాలపరిమితిలోగా రాష్ట్రాన్ని విభజించాలని సిడబ్ల్యూసీలో తీర్మానించింది. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండానే ఈ విభజన ప్రక్రియ ఉంటుందని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సీమాంధ్ర ప్రాంతాన్ని సంతృప్తి పరచడానికి పోలవరానికి జాతీయహోదాను ప్రకటించింది. సీమాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ గానే ఉంచాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి