22, జనవరి 2013, మంగళవారం
మాజీ సీఎంకు పదేళ్ల జైలు
అధికారంలో ఉన్నప్పుడు ఎంత అవినీతికి పాల్పడినా చెల్లుతుందనుకునే నేతల తీరుకు చెల్లు చెప్పింది ఢిల్లీ కోర్టు. టీచర్స్ స్కామ్ లో ప్రధాన నిందితులైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా, ఆయన తనయుడు అభయ్ చౌతాలాకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఢిల్లీలోని రోహిణీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ స్కామ్ లో పాలుపంచుకున్న మరో ముగ్గురికి కూడా ఇదే శిక్షను విధించింది. 1999-2000 మధ్య 3206 మంది జూనియర్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ల నియామకంలో ముడుపులు తీసుకున్నారని వీరిపై అభియోగాలున్నాయి. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు చౌతాలా, ఆయన కుమారుడు దోషులుగా తేల్చింది. ఇవాళ శిక్షను ఖరారు చేసింది. చౌతాలాకు జైలు శిక్ష విధించడంతో ఢిల్లీ వీధుల్లో ఆయన అనుచరులు, ఐఎన్ఎల్డీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోహిణి కోర్టుల దగ్గర పోలీసులపైనా దాడి చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి