13, అక్టోబర్ 2012, శనివారం
శ్రీరామరాజ్యం ముందు తేలిపోయిన దూకుడు
Categories :
awards . entertainment . nandi . tollywood . TOP
2011 సంవత్సరానికి ప్రకటించిన నంది అవార్డుల్లో శ్రీరామరాజ్యం, దూకుడు, జైబోలో తెలంగాణ ల హడావుడి కనిపించింది. శ్రీరామరాజ్యం ఏకంగా ఏడు నందులను కైవసం చేసుకోగా.. దూకుడు ఆరు అవార్డులను, జైబోలో తెలంగాణ మూడు అవార్డులను సాధించాయి. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం నిలవగా, ఉత్తమ ప్రజాదారణ పొందిన చిత్రంగా దూకుడు, జాతీయ సమగ్రతా చిత్రంగా జైబోలో తెలంగాణ నిలిచాయి.
ఉత్తమ కథానాయకుడిగా మహేశ్ బాబు (దూకుడు), ఉత్తమ కథానాయకగా నయనతార(శ్రీరామరాజ్యం) నందులను అందుకోబోతున్నారు. ఇక ఉత్తమ హాస్యనటుడిగా దూకుడిలో నటనకు గానూ ఎంఎస్ నారాయణ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా జైబోలో తెలంగాణ సినిమాకు శంకర్ ను నంది వరించింది. తొలిసినిమాతోనే ఉత్తమ విలన్ అవార్డును మంచు లక్ష్మి(అనగనగా ఒక ధీరుడు) అందుకుని రికార్డు సృష్టించారు. పొడుస్తున్న పొద్దుమీదంటూ జనం హృదయాలు కొల్లగొట్టిన గద్దర్ ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. డబ్బింగ్ లో ఇప్పటికే ఎన్నో నందులను దక్కించుకున్నగాయని సునీత, ఈసారి కూడా శ్రీరామరాజ్యానికి గాను మరో నందిని దక్కించుకన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి