7, మార్చి 2012, బుధవారం
బీజేపీని ఓడించిన అయోధ్య ఓటర్లు
Categories :
ayodhya . bjp . POLITICS . TOP . up results
ఉత్తరప్రదేశ్లో తిరిగి పుంజుకోవాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. ఉమాభారతిని రంగంలోకి దింపి హిందుత్వ కార్డును ప్రదర్శించినా, ఫలితం లేకపోయింది. చివరకు, రెండు దశాబ్దాలుగా బీజేపీకి పట్టం కడుతూ వచ్చిన అయోధ్య ఓటర్లు కూడా ఈ సారి కమలనాథులకు మొండిచేయి చూపించారు. అయోధ్యలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ను కాదని, ఎస్పీ అభ్యర్థి తేజ్ నారాయణ్ పాండేను గెలిపించారు. బాబ్రీ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా.. ఈ స్థానంలో బీజేపీనే గెలుస్తూ వచ్చింది. కానీ, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ప్రభంజనంలో ఈ సీటు కూడా బీజేపీ ఖాతా నుంచి కొట్టుకుపోయింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి