3, మార్చి 2012, శనివారం
జగన్వర్గ ఎమ్మెల్యేలపై వేటు
Categories :
jagan . mlas . nadendla manohar . POLITICS . TOP
జగన్వర్గ ఎమ్మెల్యేలపై ఎట్టకేలకు అనర్హత వేటు పడింది. జగన్ వర్గానికి చెందిన 16మంది ఎమ్మెల్యేలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించారు. 2011 డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ విప్కు వ్యతిరేకంగా 16మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేశారు. దీనిపై అప్పటి విప్ కొండ్రు మురళీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన స్పీకర్ 16మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసి వివరణ కోరారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరుపున ఆళ్లగడ్డ ఎన్నికైన ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కూడా ఆపార్టీ విప్ను ఉల్లంఘించారు. శోభానాగిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రజారాజ్యం విప్ వంగా గీత స్పీకర్ను కోరిననప్పటికీ అనర్హత వేటు వేయకుండా, శోభానాగిరెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. స్పీకర్ నిర్ణయంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. రాజ్యాంగం 10వ షెడ్యూల్ కింద వీరిపై వేటు పడింది. వీరిలో 2(1A) కింద అమర్నాథరెడ్ది(రాజంపేట), కొండా సురేఖ(పరకాల), గడికోట శ్రీకాంత్రెడ్డి( రాయచోటి), 2(1B) కింద మిగతా వారిపై వేటు వేశారు. మేకపాటి రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఆమోదించడంతో నాదెండ్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు వీరే
బాలినేని శ్రీనివాసరెడ్డి(ఒంగోలు)
పిల్లి సుభాష్చంద్రబోస్(రామచంద్రాపురం
అమర్నాథరెడ్ది(రాజంపేట)
కొండా సురేఖ(పరకాల)
ఎం. సుచరిత(పత్తిపాడు)
కాపు రామచంద్రారెడ్డి( రాయదుర్గం)
ధర్మాన కృష్ణదాస్( నర్సన్నపేట)
గుర్నాథరెడ్డి( అనంతపురం)
తెల్లం బాలరాజు(పోలవరం)
మేకపాటి చంద్రశేఖరరెడ్డి ( ఉదయగిరి)
గడికోట శ్రీకాంత్రెడ్డి( రాయచోటి)
కొరముట్ల శ్రీనివాసులు( రైల్వేకోడూరు)
కె.చెన్నకేశవరెడ్డి( ఎమ్మిగనూరు)
గొల్ల బాబూరావు(పాయకరావుపేట)
రామకృష్ణారెడ్డి(మాచర్ల)
ప్రసాదరాజు( నరసాపురం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి