7, ఆగస్టు 2011, ఆదివారం
జంబలకిడి పంబ
ఇప్పటివరకూ ఆడాళ్లను వేధించే మగాళ్లనే చూశారు. కానీ, ఇది రివర్స్ కేసు. మగాడిని వేధించే అమ్మడి కేసు. మ్యాటర్లోకి వెళితే.. ఊరు విశాఖ. అక్కడి పోలీసులకు తాజాగా ఓ కంప్లైట్ వచ్చింది. ఇచ్చింది రామకృష్ణ అనే వ్యక్తి. తనతో కాపురం చేయమంటూ ఎస్ఎంఎస్లతో ఓ మహిళ వేధిస్తుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాక్ష్యంగా ఆమె పంపిన మెసేజ్ లనూ చూపించాడు. తనకు ఇంతకుముందే పెళ్లయ్యిందని, పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల ముందు వాపోయాడు రామకృష్ణ. గతంలో తాను పనిచేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసిన అమ్మాయే ఇలా మెసేజ్ లు పంపిస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు సదరు మహిళను స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే ఆమె చెబుతున్న వెర్షన్ మాత్రం మరోలా ఉంది. తనకు రామకృష్ణతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పింది. పెళ్లి చేసుకోమంటే ప్లేట్ మార్చి ఫిర్యాదు చేయడానికి వచ్చాడంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి