23, ఆగస్టు 2011, మంగళవారం
కేంద్రాన్ని వణికిస్తున్న అన్నా
Categories :
anna hazare . news . TOP
అన్నా హజారే దీక్ష 8వ రోజుకు చేరుకుంది. అన్నా ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉంది. అయినా దీక్ష విడనాడే విషయంలో హజారే మనసు మార్చుకోలేదు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగానే ఉన్నానన్న అన్నా... ఎవరితో పడితే వారితో చర్చలు జరపమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గానీ, రాహుల్ గాంధీగానీ, ప్రధాని కార్యాలయానికి చెందిన వారు గానీ లేదంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్తో మాత్రమే చర్చిస్తానని తేల్చి చెప్పారు.
రాంలీలా మైదానంలో సాగుతున్న హజారే దీక్షకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. ఢిల్లీలో రామ్లీలా మైదానం నుంచి ఇండియా గేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. జన్లోక్పాల్ బిల్లుపై వైఖరి చెప్పాలంటూ బీజేపీ సీనియర్ నేత అద్వానీ నివాసం ముందు ధర్నా చేశారు. అన్నా డిమాండ్తో సర్కార్లో కలవరం కలిగినా.. ప్రభుత్వం తరపున అధికారికంగా ఎవరూ చర్చలకు రాలేదు. దీనిపై అన్నాటీం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కోమాలో ఉందని విమర్శించింది.
అన్నా ఆరోగ్యం విషమిస్తుండడం, దీక్ష ప్రజల మద్దతు పెరుగుతుండండతో ..కాంగ్రెస్ కోర్ కమిటీని ప్రధాని అత్యవసరంగా సమావేశపరిచారు. పీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు చిదంబరం,ప్రణబ్ముఖర్జీ, కపిల్ సిబాల్, ఆనంద్ శర్మ, పవన్ బన్సాల్ హాజరయ్యారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్ కూడా సమావేశంలో ఉన్నారు. అన్నా దీక్ష విరమింప చేయడానికి ఈ మీటింగ్లోనే పదకొండు పాయింట్లతో డ్రాఫ్ట్ను తయారు చేసి.. ఆధ్యాత్మిక గురువు భైయ్యూజీ మహరాజ్తో అన్నా టీంకు రాయబారం పంపించారు. ఈ పదకొండు పాయింట్లు ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరం. వీటికి అన్నా అంగీకరిస్తే.. జన్లోక్పాల్ బిల్లు సంక్షోభం గట్టెక్కవచ్చు. అయితే.. అనధికార వ్యక్తులతో చర్చించమని అన్నా చెప్పడం చూస్తుంటే.. భైయ్యూజీ దౌత్యం ఫలించడం కష్టంగానే కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి