12, ఆగస్టు 2011, శుక్రవారం
తెరిస్తే చస్తారు..!
పద్మనాభస్వామి ఆలయంలో ఇంతవరకూ రహస్యంగానే ఉన్న బి చాంబర్ ను తెరవడానికి వీల్లేదని దేవప్రశ్నం తేల్చేసింది. ఒకవేళ ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చావడం ఖాయమని దేవప్రశ్నం నిర్వహించిన జోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ బయటపడ్డ సంపదను వీడియో తీయడం వల్లా అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పద్మనాభస్వామికి సంబంధించి రహస్యంగా ఉన్న సంపదను, ఆభరణాలను ప్రదర్శనకు ఉంచడం సరికాదని దేవప్రశ్నం నిర్వహించిన ప్రధాన పూజారి కె.పద్మనాభశర్మ తెలిపారు. బి చాంబర్ను ఎప్పుడోకప్పుడు దేవుడే తెరుస్తాడని అంతవరకూ వేచి ఉండడమే మంచిదని ఆయన అంటున్నారు. దేవుడి అడ్డంకులను కాదని ఎవరైనా తెరవడానికి ప్రయత్నిస్తే, వారి కుటుంబంలోని వారు పాము కాటు వల్లో, లేదంటే విషం తాగో చనిపోతారని అంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి