1, జులై 2011, శుక్రవారం
'బి' కంపెనీతో సంబంధాలు నిజమే..
Categories :
entertainment . news . TOP
తెలుగు సినీ ఇండస్ట్రీలో, రాష్ట్ర రాజధానిలో చేసిన సెటిల్ మెంట్లలో మద్దెలచెర్వు సూరి హంతకుడు భానుకిరణ్ పాత్ర ఎక్కువగానే ఉందన్న విషయాన్ని నిర్మాతలు సింగనమల రమేశ్, సి.కళ్యాణ్ లు ఒప్పుకున్నారు. భాను సహకారంతో చాలా సెటిల్మెంట్లు చేశానని సీఐడీ పోలీసులకు ఇచ్చిన నేరాంగీకరవాంగ్మూలంలో సింగనమల చెప్పారు. ఫైనాన్షియర్ల ఒత్తిడి వల్లే సెటిల్మెంట్లకు పాల్పడాల్సి వచ్చిందన్నాడు. సూరే.. భానును తనకు పరిచయం చేశాడని పోలీసులు చెప్పాడు. చెన్నైలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సింగనమలకు 7 రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది. పోలీసులు చేసిన సోదాల్లో రమేశ్ కు సంబంధించిన 20 డెబిట్ కార్డులు, వంద బ్లాంక్ చెక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సీఐడీ అదుపులోనే ఉన్న నిర్మాత కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. భానుతో ఉన్న సంబంధాలను పోలీసులకు వెల్లడించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి