4, జులై 2011, సోమవారం
ప్రపంచంలోనే ధనవంతుడైన దేవుడు
ధనరాశులు.. అంతులేని ధనరాశులు.... నేళమాళిగలో అపారసంపద....తవ్వేకొద్దీ బంగారం....వజ్రాలు, వైడ్యూర్యాలు... పచ్చలు పొదిగిన ఆభరణాలు... వెలుగులోకి వచ్చిన నగల విలువ లక్ష కోట్లకు పైనే....
రళ త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయంలో సుప్రీంకోర్టు నియమించిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 20 అడుగుల లోతులోని నేళమాళిగల్లో వెలకట్టలేని సంపద బయటపడుతోంది. ఆరోరోజు జరిగిన తనిఖీల్లో భారీగా బంగారు, వజ్ర వైడ్యూర్యాలను గుర్తించారు.
ఇందులో స్వచ్ఛమైన బంగారంతో చేసిన అత్యంత పురాతనమైన నాలుగడుగుల శ్రీమహా విష్ణువు విగ్రహం ఉంది. ఈ విగ్రహంపై విలువైన వజ్రాలు, రాళ్లు పొదిగి ఉన్నాయి. స్వామివారి అలంకరణ కోసం 18 అడుగుల పొడవు, 35 కేజీల బంగారంతో తయారుచేసిన హారం ఒకటి బయటపడింది. కేజీల కొద్దీ బంగారంతో తయారుచేసిన మానవ విగ్రహాలు, కిరీటాలు, ఆయుధాలు, వందల హారాలు, ఒక్కోటీ ఐదుకోట్లకుపైగా విలువచేసే వజ్రాలు ఉన్నాయి.
అంతేకాదు 20 బస్తాల్లో లక్ష బంగారు నాణేలు, లక్ష వెండి నాణాలు, పచ్చలు,కెంపులు, అరుదైన ఇంద్రనీలాలు ఈ తనిఖీల్లో వెలుగు చూశాయి. అత్యంత పురాతనమైన వీటికి విలువ కట్టడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆలయం ప్రాంగణంలో ఆరు రహస్య నేళమాళిగలున్నాయి. ఇందులో ఇప్పటికి నాలుగింటిలో తనిఖీలు పూర్తయ్యాయి. ఒక్కో ఛాంబర్లో రహస్య అరలుండటంతో జాగ్రత్తగా సోదాలు చేయాల్సి వస్తోంది. ఈ రహస్యగదుల తలుపులను బద్దలు కొట్టడానికి ఫైర్ఫైటర్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. మిగిలిన రెండు ఛాంబర్లను సోమవారం తెరిచారు.. మరోవారం పాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఇందులోని బీ ఛాంబర్లో కూడా వేలకోట్ల విలువైన సంపద ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. దేశంలోనే ఇప్పటికి తిరుపతి ఆ తర్వాత షిర్డీ అత్యంత ధనిక ఆలయాలుగా ఉన్నాయి. ఇప్పుడు త్రివేండ్రం పద్మనాభస్వామి ఆలయం వీటిని మించిపోనుంది. చెప్పాలంటే.. ప్రపంచంలోనే అత్యంత ఆస్తిపరుడైన దేవుడిగా అనంతపద్మనాభుడు రికార్డు సృష్టిస్తున్నాడు.
ఇంతకీ ఎక్కడివీ ధనరాశులు....
ఎవరు దాచి ఉంటారు...
ఇంతకాలం ఎందుకు బయటపడలేదు...
ఈ ఆలయానికి ఐదువేల ఏళ్ల చరిత్ర ఉంది. 1729లో ట్రావన్కోర్ రాజవంశానికి చెందిన మార్తాండవర్మ అనే రాజు ఈ ఆలయాన్ని జీర్ణోద్దరణ గావించారు. పద్మనాభస్వామి సేవకుడు అన్నపేరుతోనే ఆయన రాజ్యపాలన చేశాడు. ఆలయానికి విలువైన సంపదను
దానం చేశాడు. అప్పటినుంచీ రాజవంశం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలోనే దేవాలయం నడుస్తోంది. ఈ వంశానికి చెందిన రాజు ప్రతిరోజూ స్వామి దర్శనం చేసుకుంటారు. బ్రిటీషర్ల బారినుంచి తమ సంపదను కాపాడుకోవడం కోసం ట్రావన్కోర్ రాజవంశం ఇంత విలువైన సంపదను ఆలయానికి తరలించి రహస్య మాళిగల్లో దాచి ఉంటుందని భావిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి