నెట్వర్క్ 18 చేసిన ప్రకటనకు కాస్త భిన్నమైన ప్రకటనను రామోజీ గ్రూప్ సంస్థ ఉషోదయా ఎంటర్ప్రైజెస్ చేసింది. దీని ప్రకారం, ఈటీవీలో ఛానళ్ల అమ్మకం ఎప్పుడో పూర్తైపోయింది. ఈటీవీ తెలుగు, ఈటీవీ 2 మినహా మిగిలిన అన్ని ఛానళ్లను ముఖేష్ అంబానీ చాలా రోజుల క్రితమే కొనేశారు. ఈటీవీ తెలుగు, ఈటీవీ 2 ల్లో మాత్రం 49 శాతం రిలయన్స్ కొనుగోలు చేసింది. రిలయన్స్ కొన్న ఛానళ్లలోనే వాటాలను.. టీవీ 18 దక్కించుకుంది. దీన్ని బట్టి చూస్తే, ఇది టీవీ 18కు, రిలయన్స్కు మధ్య కుదిరిన ఒప్పందమే తప్ప.. ఈటీవీకి, టీవీ 18కు కుదిరిన ఒప్పందం కాదని తెలుస్తోంది. ఈటీవీ నెట్వర్క్ను రిలయన్స్ కొనుగోలు చేసిందన్న విషయమూ ఇంతవరకూ బయట పడకపోవడం విశేషమే.. బహుశా, ఈటీవీ గ్రూప్ ఎంప్లాయిస్కు ఇది మరింత పెద్ద షాక్ కావచ్చు.. ఛానళ్ల అమ్మకంపై రామోజీ గ్రూప్ ఇచ్చిన వివరణ ఇదీ..
ఈటీవీ ఛానెళ్లలో వాటాల మార్పిడి జరిగింది. రామోజీరావుకు చెందిన మీడియా సంస్థ ఉషోదయా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్లో కొద్దికాలం క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన గ్రూపు కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టింది. ఉషోదయా ఎంటర్ప్రైజెస్కు రెండు తెలుగు ఛానళ్లు(ఈటీవీ, ఈటీవీ-2), పది ఇతర భాషా ఛానళ్లు ఉన్న విషయం విదితమే. ఇందులో ఈటీవీ బంగ్లా, ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియాలు భాషా ఛానళ్లు కాగా, ఈటీవీ ఉర్దు, ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ బీహార్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ మధ్యప్రదేశ్ మాత్రం వార్తా- వినోద ఛానళ్లు. ఇంతకుముందు కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు తెలుగు ఛానళ్లు మినహా, మిగిలిన 10 ఛానళ్లలో 100% వాటా రిలయన్స్ గ్రూపు సంస్థలకు దక్కుతుంది. రెండు తెలుగు ఛానళ్లలో మాత్రం 49% వాటా కేటాయిస్తారు. మిగిలిన 51% వాటా ఉషోదయా ఎంటర్ప్రైజెస్కే ఉంటుంది.
రిలయన్స్ నుంచి టీవీ 18కు ....
మరోవైపు రిలయన్స్ గ్రూపు సంస్థలు ఈటీవీ ఛానళ్లలోని తమ వాటాను కొంత మేరకు టీవీ 18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్, నెట్వర్క్ 18లకు విక్రయిస్తున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టీవీ 18 బ్రాడ్కాస్ట్, నెట్వర్క్ 18 సంస్థలు మంగళవారం వెల్లడించాయి. దీని ప్రకారం రిలయన్స్ గ్రూపు సంస్థల నుంచి అయిదు ఈటీవీ ప్రాంతీయ వార్తా- వినోద ఛానళ్లలో(ఈటీవీ ఉర్దు, ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ బీహార్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ మధ్యప్రదేశ్) నూరు శాతం వాటాను నెట్వర్క్ 18 కొనుగోలు చేస్తోంది. అదేవిధంగా అయిదు ఇతర భాషా ఛానళ్లలో (ఈటీవీ బంగ్లా, ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియా) 50% వాటా తీసుకుంటోంది. అంతేగాక రెండు తెలుగు ఈటీవీ ఛానళ్లలోనూ తనకు ఉన్న 49% వాటా నుంచి రిలయన్స్ గ్రూపు సంస్థలు 24.5% వాటాను నెట్వర్క్ 18 సంస్థలకు విక్రయిస్తున్నాయి.
నిధుల సేకరణకు నెట్వర్క్ 18 సన్నాహాలు
ఈటీవీ ఛానళ్లలో వాటాల కొనుగోలు నిమిత్తం అవసరమైన నిధుల సేకరణకు నెట్వర్క్ 18, టీవీ 18 సన్నాహాలు చేస్తున్నాయి. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సేకరించనున్నట్లు ఈ కంపెనీలు వెల్లడించాయి. రైట్స్ ఇష్యూలో భాగంగా ఈ రెండు సంస్థల ప్రమోటర్లు కూడా తమ వంతు వాటా నిధులు తెచ్చేందుకు సంసిద్ధమవుతున్నారు. నెట్వర్క్ 18 మీడియా, టీవీ 18 బ్రాడ్కాస్ట్లు రెండూ స్టాక్ మార్కెట్లో నమోదైన సంస్థలు. ఈ రెండూ మంగళవారం రైట్స్ ఇష్యూ ప్రకటన చేశాయి.
Read more...
tv18 లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
tv18 లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
4, జనవరి 2012, బుధవారం
ఈటీవీ నెట్వర్క్ అమ్మేసిన రామోజీ..
ఈటీవీ నెట్వర్క్ అమ్మకంపై చాలాకాలంగా కొనసాగుతున్న ఉత్కఠ వీడిపోయింది. సీఎన్బీసీ, సీఎన్ఎన్ ఐబీఎన్, కలర్స్ లాంటి ఛానల్స్ నిర్వహిస్తున్న టీవీ 18 గ్రూప్.. ఈటీవీ నెట్వర్క్లో మెజార్టీ వాటాను సొంతం చేసుకుంది. హిందీ ఛానళ్లైన ఈటీవీ ఉత్తర ప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ బీహార్తో పాటు ఈటీవీ ఉర్ధూను పూర్తిగా సొంతం చేసుకుంది. ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ బంగ్లా, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియాల్లో యాభైశాతం వాటాను సొంతం చేసుకుంది. ఈటీవీ తెలుగు, ఈటీవీ రెండులో 24.5 శాతం వాటాను దక్కించుకుంది. ఈ డీల్ విలువ 2100 కోట్ల రూపాయలని టీవీ 18 గ్రూప్ ప్రకటించింది. టీవీ 18, ఈటీవీల మధ్య డీల్ కుదర్చడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈటీవీకి చెల్లించాల్సిన 2100 కోట్ల రూపాయలను టీవీ 18 గ్రూప్కు రిలయన్స్ ట్రస్ట్ ద్వారా ఆయన అందిస్తున్నారు. ప్రతిగా, టీవీ 18, ఈటీవీ గ్రూప్ ఛానళ్ల వైరెలెస్ ప్రసారాలను చేసుకునే హక్కును ఆయన నేతృత్వంలోని ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్కు దక్కుతాయి. దేశవ్యాప్తంగా 4జీ లైసెన్సులు ఇన్ఫోటెల్కు ఉన్నాయి. త్వరలోనే బ్రాడ్బ్యాండ్ రంగంలో విప్లవం సృష్టించడానికి సిద్ధమవుతున్న ముఖేశ్ అంబానీ, వైర్లెస్ పద్దతిల్లో, బ్రాడ్బ్యాండ్ ద్వారా టీవీ ఛానళ్లను కూడా అందించడానికి తాజా డీల్ ఉపయోగపడుతుంది. ఛానళ్లలో వాటాలు అమ్మడం ద్వారా రామోజీ ఆర్థిక కష్టాలు చాలా వరకూ తీరిపోనున్నాయి.
టీవీ 9ను కూడా దాని ప్రమోటర్లు అమ్మేయడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే టైమ్స్ నౌ గానీ, మరో సంస్థ గానీ టీవీ 9ను టేకోవర్ చేసే అవకాశాలున్నాయి.
కొసమెరుపు.. ఈటీవీ 2, టీవీ 9 కన్నా ఓ నెల రోజులు ముందుగా ప్రసారాలు ప్రారంభించింది. ముందుగానే అమ్ముడయ్యింది. టీవీ 9 అమ్మకానికి సిద్ధం గాఉంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

