కేసీఆర్ తొలి కేబినెట్ కొలువు దీరింది. పదకొండుమందికి తన కేబినెట్లో చోటు కల్పించారు కేసీఆర్. కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు, మేనల్లుడు హరీశ్ రావు కూ ఈ సారి మంత్రిపదవులు దక్కాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుకూ చోటు దక్కింది. మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమూద్ అలీ, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. ఇక ఉద్యోగ సంఘాల నేతల నుంచి ప్రజాప్రతినిధులుగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఇక ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకూ ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది.
cabinet లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
cabinet లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
2, జూన్ 2014, సోమవారం
ఉద్యోగ నేతల్లేరు.. ఖమ్మం,పాలమూరుకు చోటు లేదు..
కేసీఆర్ తొలి కేబినెట్ కొలువు దీరింది. పదకొండుమందికి తన కేబినెట్లో చోటు కల్పించారు కేసీఆర్. కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు, మేనల్లుడు హరీశ్ రావు కూ ఈ సారి మంత్రిపదవులు దక్కాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుకూ చోటు దక్కింది. మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమూద్ అలీ, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. ఇక ఉద్యోగ సంఘాల నేతల నుంచి ప్రజాప్రతినిధులుగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఇక ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకూ ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది.
27, మే 2014, మంగళవారం
ఒబామా రూల్ నే ఫాలో అయిన మోడీ
Categories :
bjp . cabinet . External Affairs . modi . POLITICS . sushma swaraj
ఓ చిక్కుముడిని విప్పుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాను అనుసరించారు భారత కొత్త ప్రధాని నరేంద్ర మోడి. మోడీకొచ్చిన చిక్కేమిటనుకుంటున్నారా.. సుష్మా స్వరాజ్. ప్రతిపక్ష నేతగా హల్ చల్ చేసి ఈ సారి ప్రధాని పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సుష్మా. కానీ, గుజరాత్ లో అప్రతిహత విజయాలతో తెరపైకి వచ్చిన మోడీ, ఆమె ఆశలపై నీళ్లు పోశారు. అప్పటినుంచీ వీరి మధ్య పెద్దగా సఖ్యత లేదనే చెప్పాలి. శివసేన కూడా ఓ దశలో సుష్మా పేరునే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, మోడీకే ఎక్కువ బలం ఉండడంతో ఆయనవైపే అంతా చూశారు. దానికి తగ్గ ఫలితాన్ని సాధించారు.. అయితే.. సుష్మాకున్న సీనియరిటీ దృష్ట్యా ఆమెకు తన కేబినెట్ లో ప్లేస్ ఇచ్చారు మోడీ.
ఇక్కడ సీన్ కట్ చేసి , ఓ సారి అమెరికా కు వెళ్దాం. అక్కడ కూడా ఇదే సీన్. ఆరేళ్ల క్రితం ఒబామాతో అధ్యక్ష అభ్యర్థిగా హోరాహోరీగా తలపడ్డారు హిల్లరీ క్లింటన్. చివరకు పార్టీలో ఎక్కువ మద్దతు కూడగట్టిన ఒబామా అధ్యక్ష అభ్యర్థిగా నిలబడడం, ఆపై విజయం సాధించడం అందరికీ తెలిసిందే. ఎన్నికలయ్యాక, హిల్లరీ క్లింటన్ ను తన కేబినెట్ లో చేర్చుకున్నారు, అయితే, దేశానికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో తనకు ఎక్కడ హిల్లరీ క్లింటన్ అడ్డు తగులుతుందోనని భావించిన ఆయన తెలివిగా ఆమెకు విదేశీ వ్యవహారాలను అప్పగించారు.
ఇప్పుడు మోడీ కూడా అదే పని చేశారు. సుష్మాకు ఏ ఫోర్ట్ ఫోలియో దక్కుతుందోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఆమెకు విదేశీ వ్యవహారాలిచ్చి చేతులు దులుపుకున్నారు మోడీ. తనకు అనుకూలంగా ఉండే అరుణ్ జైట్లీకి కీలకమైన ఆర్థిక, రక్షణ శాఖలను , హోం శాఖను రాజ్ నాథ్ కు కేటాయించి తన చాణక్యాన్ని చాటుకున్నారు మోడీ.
ఇక్కడ సీన్ కట్ చేసి , ఓ సారి అమెరికా కు వెళ్దాం. అక్కడ కూడా ఇదే సీన్. ఆరేళ్ల క్రితం ఒబామాతో అధ్యక్ష అభ్యర్థిగా హోరాహోరీగా తలపడ్డారు హిల్లరీ క్లింటన్. చివరకు పార్టీలో ఎక్కువ మద్దతు కూడగట్టిన ఒబామా అధ్యక్ష అభ్యర్థిగా నిలబడడం, ఆపై విజయం సాధించడం అందరికీ తెలిసిందే. ఎన్నికలయ్యాక, హిల్లరీ క్లింటన్ ను తన కేబినెట్ లో చేర్చుకున్నారు, అయితే, దేశానికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో తనకు ఎక్కడ హిల్లరీ క్లింటన్ అడ్డు తగులుతుందోనని భావించిన ఆయన తెలివిగా ఆమెకు విదేశీ వ్యవహారాలను అప్పగించారు.
ఇప్పుడు మోడీ కూడా అదే పని చేశారు. సుష్మాకు ఏ ఫోర్ట్ ఫోలియో దక్కుతుందోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఆమెకు విదేశీ వ్యవహారాలిచ్చి చేతులు దులుపుకున్నారు మోడీ. తనకు అనుకూలంగా ఉండే అరుణ్ జైట్లీకి కీలకమైన ఆర్థిక, రక్షణ శాఖలను , హోం శాఖను రాజ్ నాథ్ కు కేటాయించి తన చాణక్యాన్ని చాటుకున్నారు మోడీ.
26, మే 2014, సోమవారం
మోడీ మంత్రులు వీళ్లే..
ఈ సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్రమోడీ, తన మంత్రివర్గంలో మొత్తం 45 మందికి చోటు కల్పించారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులు, 11 మంది సహాయ మంత్రులు, మరో పదిమంది స్వతంత్ర హోదా గల మంత్రులున్నారు.
కేబినెట్ ర్యాంక్ మంత్రులు
రాజ్నాథ్ సింగ్
అరుణ్ జైట్లీ
నితిన్ గడ్కరీ
సుష్మా స్వరాజ్
వెంకయ్య నాయుడు
సదానంద గౌడ
ఉమా భారతి
నజ్మా హెప్తుల్లా
గోపీనాథ్ ముండే
రాం విలాస్ పాశ్వాన్
కాల్ రాజ్ మిశ్రా
మనేకా గాంధీ
అనంత్ కుమార్
రవి శంకర్ ప్రసాద్
అశోక్ గజపతి రాజు
అనంత్ గీతే
హర్ స్మిత్ కౌర్ బాదల్
నరేంద్ర సింగ్ తోమర్
జువాల్ ఓరమ్
రాధా మోహన్ సింగ్
తవార్ చంద్ గెహ్లాట్
సృతి ఇరానీ
హర్షవర్ధన్
ఈ జాబితాను ఇప్పటికే రాష్ట్రపతికి పంపించారు మోడీ. ఇక వీరిలో ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేబినెట్ ర్యాంక్ మంత్రులు
రాజ్నాథ్ సింగ్
అరుణ్ జైట్లీ
నితిన్ గడ్కరీ
సుష్మా స్వరాజ్
వెంకయ్య నాయుడు
సదానంద గౌడ
ఉమా భారతి
నజ్మా హెప్తుల్లా
గోపీనాథ్ ముండే
రాం విలాస్ పాశ్వాన్
కాల్ రాజ్ మిశ్రా
మనేకా గాంధీ
అనంత్ కుమార్
రవి శంకర్ ప్రసాద్
అశోక్ గజపతి రాజు
అనంత్ గీతే
హర్ స్మిత్ కౌర్ బాదల్
నరేంద్ర సింగ్ తోమర్
జువాల్ ఓరమ్
రాధా మోహన్ సింగ్
తవార్ చంద్ గెహ్లాట్
సృతి ఇరానీ
హర్షవర్ధన్
ఈ జాబితాను ఇప్పటికే రాష్ట్రపతికి పంపించారు మోడీ. ఇక వీరిలో ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
7, ఫిబ్రవరి 2014, శుక్రవారం
సీమ, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ
Categories :
bifurcation . cabinet . POLITICS . seemandhra . tbill . telangana
సీమాంధ్ర కేంద్ర మంత్రుల ఒత్తిడితో రాష్ట్ర విభజన బిల్లుకు పలు సవరణలు సూచిస్తూ జీవోఎం ఇచ్చిన నివేదికను పాక్షికంగా ఆమోదించింది కేంద్ర కేబినెట్. రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్రపతికి పంపి ఆయన్నుంచి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. వీలైతే వచ్చేవారం మొదటి మూడు రోజుల్లో విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపైనే చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనిపై విస్తృతంగా చర్చించింది. సీమాంధ్ర సమస్యలపైనే కేంద్రమంత్రి కావూరి అరగంటకుపైగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను తోసి పుచ్చిన కేంద్ర కేబినెట్, గతంలో ఆమోదించిన పదేళ్లపాటు ఉమ్మడి రాజధానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. అయితే, పోలవరం ముంపు గ్రామాలను పూర్తిగా సీమాంధ్రలోనే కలపాలని, వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. బిల్లు ఆమోదం పొందిన తర్వాత సీమాంధ్ర కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనుంది కేంద్రం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
