పరిపాలనలో, నిర్ణయాల్లో తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిని మించి మరొకరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతున్నారు. ఏపీలో ఎన్టీఆర్ సుజల పథకం మొదలుపెడితే.. తెలంగాణలో ఏకంగా వాటర్ గ్రిడ్ కే రూపకల్పన చేశారు కేసీఆర్. ఏపీలో నదుల అనుసంధానంపై కసరత్తు జరుగుతుంటే.. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు పనులు మొదలవుతున్నాయి. రైతురుణమాఫీ విషయంలోనూ రెండు ప్రభుత్వాలూ ఒకే తరహా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ వార్ తాజాగా హెలికాప్టర్ల వరకూ వచ్చింది. కొత్త హెలికాప్టర్ను కొనుగోలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే చంద్రబాబు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే.. కేవలం హెలికాప్టర్ తోనే ఆగిపోకుండా, ఓ చిన్న సైజ్ విమానాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఏపీ ఏవియేషన్ అకాడమీని ఆదేశించారు.
ప్రస్తుతం జిల్లాల పర్యటనకు జీఎంఆర్ కు చెందిన విమానాలు, హెలికాప్టర్లను చంద్రబాబు ఉపయోగిస్తున్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించడానికి హెలికాప్టర్ పూర్తిగా అనువుగా ఉండదు కాబట్టి, అలాంటి సమయాల్లో ఉపయోగించుకోవడానికి విమానాన్ని కూడా కొనుగోలు చేయనున్నారు.తాజా పరిస్థితి చూస్తుంటే.. ఇద్దరు సీఎంలకు దాదాపుగా ఒకే సమయంలో కొత్త హెలికాప్టర్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం జిల్లాల పర్యటనకు జీఎంఆర్ కు చెందిన విమానాలు, హెలికాప్టర్లను చంద్రబాబు ఉపయోగిస్తున్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించడానికి హెలికాప్టర్ పూర్తిగా అనువుగా ఉండదు కాబట్టి, అలాంటి సమయాల్లో ఉపయోగించుకోవడానికి విమానాన్ని కూడా కొనుగోలు చేయనున్నారు.తాజా పరిస్థితి చూస్తుంటే.. ఇద్దరు సీఎంలకు దాదాపుగా ఒకే సమయంలో కొత్త హెలికాప్టర్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కామెంట్ను పోస్ట్ చేయండి