19, జులై 2011, మంగళవారం
ఉస్మానియాలో మావోయిస్టులు?
ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయంలోకి మావోయిస్టులు చొరబడ్డారా..? తెలంగాణ ఉద్యమాన్ని వారే నడిపిస్తున్నారా..? అందుకే రాష్ట్రాన్ని విభజించకూడదా..? ఈ అనుమానాలు మావి కాదు.. సీమాంధ్ర నేతలవి. తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టులు ఊతమిస్తున్నారని అనుమానిస్తున్న ఆంధ్రానేతలు, ఓ రహస్య రిపోర్ట్ ను తయారు చేశఆరు. దీన్ని ఢిల్లీ పర్యటనలో ప్రధానికి కూడా అందించారు. తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్టులే నడిపిస్తున్నారని, రాష్ట్రాన్ని విభజిస్తే అక్కడ వారు బలోపేతం అవుతారని, అందుకే రాష్ట్రాన్ని విభజించకూడదని రిపోర్టులో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. విశ్వవిద్యాలయాల్లో మావోయిస్టులు ఉన్నారని చెప్పలేదని, మావోయిస్టు ప్రభావిత ఉద్యమమని మాత్రమే చెప్పామని జీ 24 గంటలుతో కాంగ్రెస్ నేత కొండ్రు మురళి స్పష్టం చేశారు. కావాలంటే, నిఘా వర్గాల సమాచారంతో సరిచూసుకోవచ్చని కూడా తమ నేతలు ప్రధానికి చెప్పారన్నారు. మొత్తానికి ఓ ఉగ్రవాద ఉద్యమంగా తెలంగాణ పోరాటాన్ని చిత్రించాలని చూస్తున్నారు సీమాంధ్రనేతలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి