From 24 గంటలు |
"కారులో వెళ్లేటప్పుడు వంద కిలోమీటర్ల స్పీడుతో వెళితే పర్వాలేదు. కానీ, విమానంలా వెయ్యి కిలోమీటర్ల వేగంతో వెళ్లిపోతే ఏమవుతుంది.? యాక్సిడెంట్ అయ్యి నేరుగా పరలోకానికే పోతారు. రాజకీయాల్లోనూ అంతే. స్పీడ్ ఎక్కువైతే పరలోకానికి పోవాల్సి వస్తుంది.." ఇంత భారీ డైలాగ్ కొట్టింది.. మాటలరావని, తెలుగు మాట్లాడలేడని అంతా ఎద్దేవా చేసే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. గుంటూరు బహిరంగసభలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎవరిని ఉద్దేశించి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. సరే.. తెలియని వాళ్లకైతే.. టార్గెట్.. జగన్. ప్రభుత్వంపై సత్యదూరమైన వార్తలను జగన్ మీడియా రాస్తోందని మండిపడ్డారు. అయితే.. పరలోకానికి పోతారంటూ ఓ మతాన్ని గుర్తు చేస్తూ.. అదే సమయంలో విమానంలా వెళితే అంటూ.. వైఎస్ మరణానికి లింకుపెడుతూ.. సీఎం మాట్లాడడం కలకలం పుట్టిస్తోంది. జగన్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసినా కష్టమే అనుకున్నందుకే సీఎం ఇలా మాట్లాడి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
కామెంట్ను పోస్ట్ చేయండి