17, జులై 2011, ఆదివారం
పాపం వైఎస్ దట.. పుణ్యం జగన్ దట
పాపం వైఎస్ ది.. పుణ్యం మాత్రం మాది అంటున్నారు జగన్ అనుచర గణం. సీబీఐ విచారణతో ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్న జగన్ శిబిరం ఇప్పుడో మాస్టర్ ప్లాన్ వేసింది. జగన్ మనసులో మాట అంబటి నోట పలికింది. సీబీఐ విచారణలో ఏదైనా తప్పు బయటపడినా, కొంతమంది ఆరోపిస్తున్నట్లు తప్పులేవైనా జరిగినా, అవి వైఎస్ పాలనకే చెల్లుతాయని, వైఎస్ తో పాటే, అప్పటి మంత్రవర్గమూ దానికి బాధ్యులవుతుందని అంబటి తేల్చేశారు. అంతే తప్ప, రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ ఏ మంత్రి పదవిలో లేని జగన్ కు సంబంధం ఉండదని అంబటి రాంబాబు చెబుతున్నారు. తమ పార్టీ నాయకుడిని కాపాడాలనుకుని, ఆయన తండ్రి వైఎస్ పైనా మచ్చ వేసేయడానికి సిద్ధమైపోయారు. అంతేకాదు.. సీబీఐ విచారణతో తమకు నష్టమేమీ లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ కు ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతుందని చంకలు గుద్దుకున్నారు. అంతా బాగానే ఉన్నా.. వైఎస్సార్ వారసుడిగా వస్తున్న జగన్.. ఈ కొత్త ఎత్తుగడ వేయడమే రాజకీయ చాణక్యాన్ని చాటిచెబుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తిహార్ జైలుకెళితే మరింత పబ్లిసిటీ వస్తుంది, ఢిల్లీలో పాగా వేసే చాన్స్ కూడా వస్తుంది, చలో తిహార్!:))
nee abba antha digajaravu ra..nanna meda macha vesthawa