21, ఫిబ్రవరి 2013, గురువారం
బాబా రాందేవ్ కు ఝలక్
Categories :
baba ramedv . himachal govt . lease cancel . news . TOP
పతంజలి యోగాపీఠ్ ద్వారా యోగ,ఆయుర్వేద ఆస్పత్రులను నిర్వహిస్తున్న బాబారాందేవ్కు హిమాచల్ ప్రదేశ్ సర్కార్ షాక్ ఇచ్చింది. పతంజలి యోగాపీఠ్ విస్తరణ కోసం 2010లో అప్పటి బీజేపీ ప్రభుత్వం రాందేవ్బాబాకు 28 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చింది. ఛాయల్, కందఘాట్ మధ్యలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు 35 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. దీన్ని కేవలం ఒక్క రూపాయికే 99 ఏళ్లపాటు లీజుకు బీజేపీ సర్కార్ రాందేవ్ బాబాకు ధారాదత్తం చేసింది. దీనిపై అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళనలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. కేబినెట్ మీటింగ్లో చర్చింది.. ఈ లీజును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు హిమాచల్ సీఎం వీరభద్రసింగ్.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కుటుంబం.. ఈ భూమిని 1956లో ప్రభుత్వానికి దానం చేసింది. విద్యార్థుల సంక్షేమానికి ఈ భూమిని వినియోగించాల్సిందిగా కోరింది. దాతల కోరిక మేరకే, ప్రభుత్వం అక్కడ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను నిర్మిస్తామంటున్నారు సీఎం వీరభద్రసింగ్. నిబంధలను ఉల్లంఘించి లీజు తీసుకున్నందుకు రాందేవ్కు నోటీసులు జారీ చేయాలనీ నిర్ణయించారు. లీజుకు తీసుకున్న స్థలంలో ఇప్పటికే రాందేవ్ ట్రస్ట్.. కొన్ని నిర్మాణాలను చేపట్టింది. దాదాపు ఏడున్నర కోట్లను ఖర్చు పెట్టింది. ఫిబ్రవరి 7న తొలి దశ ప్రాజెక్టును ప్రారంభించడానికి రాందేవ్ అక్కడికి వెళ్లనున్నారు. ఈ లోగానే లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి