2, సెప్టెంబర్ 2011, శుక్రవారం
ఆ భూమి ఎంత చీపో... బాబు మహిమేనా..!
Categories :
chandrababu . POLITICS . TOP
రాజకీయనాయకులు తమ కుటుంబ ఆస్తులు ప్రకటించాలంటూ కొంతకాలం క్రితం భారీ స్టేట్ మెంట్ ఇచ్చిన చంద్రబాబు, తన మాటకు కట్టుబడి తన ఫ్యామిలీ ఆస్తులు ప్రకటించారు. ఆయన,ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రహ్మణిల ఆస్తులను బహిరంగంగా ప్రకటించారు. అందులో నందినీ హిల్స్ లో బ్రహ్మణి పేరిట ఉన్న778 చదరపు గజాల స్థలం విలువ.. 4.79 లక్షల విలువని పేర్కొన్నారు. ఆహా ఎంత చీప్ రేటు. హైదరాబాద్లో ఎక్కడైనా ఇంత తక్కువ ధరకు భూమి వస్తుందా? మనలో మాట.. నేను లంగర్ హౌస్ దాటాక అరె మైసమ్మ దగ్గర మెయిన్ రోడ్డుకు దాదాపు కిలోమీటరు లోపల అడిగితేనే గజం ఏడు వేల రూపాయలు చెబుతున్నారు. ఒకవేల 778 చదరపు అడుగుల భూమి కొనాలంటే నేను, 5 కోట్ల 44 లక్షల రూపాయలు కట్టాలి. సరే.. బ్రహ్మణి విషయానికి వద్దాం.. నందిని హిల్స్లో బ్రహ్మణి కొన్న స్థలంలో గజం విలువ కేవలం రూ. 616 పడినట్లు. ఇంతకు రెట్టింపు ఇవ్వడానికి నేను రెడీ.. బాబు గారు వందశాతం లాభంతో ఆ స్థలం అమ్ముతారా..!
ఇక చంద్రబాబు కుటుంబం మొత్తానికి ఉన్న ఆస్తులు 39 కోట్ల 88 లక్షల రూపాయలట. వీటిలో చంద్రబాబు పేరిట రూ.40 లక్షలు మాత్రమే ఉన్నాయట. మిగిలిన వన్నీ భార్య,కొడుకు,కోడల ఆస్తేనట. నిన్నగాక మొన్న బిజినెస్లోకి వచ్చిన లోకేశ్కు 6.75 కోట్ల ఆస్తులున్నాయట. తాను ఇల్లు కట్టుకున్నప్పుడు 22 లక్షలు ఖర్చయ్యాయని, అది ఇప్పుడు బ్యాంకు తనఖాలో ఉందని బాబు చెబుతున్నారు. నమ్మేవాళ్లు ఉండాలి గానీ, చెప్పేవాళ్లంతా చంద్రబాబులే అవుతారు. ఇక్కడో కొసమెరుపుంది. ఈ ఆస్తులన్నీ ప్రస్తుత మార్కెట్ ధరలు కాదని చివర్లో చెప్పారు. ఆస్తుల ప్రకటించాలని ఆవేశంగా చెప్పినవాళ్లు.. ప్రస్తుత ధరలు చెప్పాలి కానీ, పాతికేళ్ల క్రితం ధరలు చెబితే.. ఏ లాభం.. ఏం ఉపయోగం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
all r fine except u said lokesh had 6.75 crores.He came recently in business but he didn't say that he earned in business.