21, జులై 2011, గురువారం
ముంబై పేలుళ్లకు కరీంనగర్ కు లింకు..?
Categories :
mumbai blast . news . TOP
ముంబై పేలుళ్లకు కరీంనగర్ కు లింకుందా..? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో మహారాష్ట్ర పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని ఇసాక్ అని పోలీసులు చెబుతున్నారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. కరీంనగర్ ఎస్పీ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. అరెస్టు నిజమే అయినప్పటికీ, అది ముంబై పేలుళ్లకు సంబంధించింది కాదని చెబుతున్నారు. థానేలో ఓ యువతి అదృశ్యమైందని, ఆ కేసులోనే ఇసాక్ ను అరెస్టు చేశారనీ ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలోనే బయటపడవచ్చు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి