21, జులై 2011, గురువారం
స్వచ్చంద బంద్ అంటే ఇదేనా..?
పార్లమెంటులో తెలంగాణ బిల్లును డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల క్రితం రెండురోజుల పాటు బంద్ నిర్వహించారు. ఇప్పుడు సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలంటూ కడప జిల్లాలో గురువారం (20/07/11)న బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది. అంతా స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొనాలని కోరింది. అంతా బాగానే ఉన్నా, బంద్ పాటించని కొంతమందిపై దాడులు జరగడమే ఆందోళనను కలిగిస్తోంది. సీమాంధ్రలో సాగుతోంది ప్రజా ఉద్యమమని అక్కడి నేతలు చెబుతున్నారు. కానీ, కడప జిల్లాలో ఈ రోజు ఉదయం విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతలు బలవంతంగా బంద్ ను నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లలో వీరంగం సృష్టించారు. బస్సుల టైర్లలో నుంచి గాలి తీసేశారు. అద్దాలు పగలగొట్టారు. ఉదయాన్నే షాపులు తెరిచిన చిన్న చిన్న వ్యాపారులపై దాడులు చేశారు. బలవంతంగా దుకాణాలు మూయించారు. పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. పెట్రోల్ నింపుకుంటున్న వారిని బెదిరించారు. బాటిల్ లో పెట్రోల్ పట్టుకుంటున్ ఓ వ్యక్తి చేతిలో నుంచి దాన్ని లాక్కొని విసిరి పారేశారు. ఆటో డ్రైవర్లను కొట్టారు. చిన్న చిన్న వారిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఇదేనా స్వచ్ఛంద బంద్..? ఇదేనా ప్రజా ఉద్యమం..? బంద్ చేయమనడం బాగానే ఉంది, కానీ, చేయమంటూ ఎవరైనా వ్యాపారం చేసుకుంటే, రాజకీయనేతలకు వచ్చే ఇబ్బంది ఏమిటి? పూట గడవక ఇబ్బంది పడేవారికి ఒక్క పూటైనా ఈ రాజకీయనేతలు తిండి పెట్టగలరా..? ఆకలితో అలమటించేవారికి ఒక్క ముద్దైనా పెట్టగలరా..? ఉద్యమాలు చేస్తున్న, చేయిస్తున్న నేతలు ఒక్కసారి ఆలోచించాలి. ప్రాంతం ఏదైనా బంద్ లు కాకుండా మరో తరహా ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. కూలీనాలీ చేసుకునేవారి, చిరు వ్యాపారుల పొట్ట కొట్టకూడదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి