కేసీఆర్ తొలి కేబినెట్ కొలువు దీరింది. పదకొండుమందికి తన కేబినెట్లో చోటు కల్పించారు కేసీఆర్. కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు, మేనల్లుడు హరీశ్ రావు కూ ఈ సారి మంత్రిపదవులు దక్కాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుకూ చోటు దక్కింది. మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమూద్ అలీ, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. ఇక ఉద్యోగ సంఘాల నేతల నుంచి ప్రజాప్రతినిధులుగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఇక ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకూ ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది.
2, జూన్ 2014, సోమవారం
ఉద్యోగ నేతల్లేరు.. ఖమ్మం,పాలమూరుకు చోటు లేదు..
కేసీఆర్ తొలి కేబినెట్ కొలువు దీరింది. పదకొండుమందికి తన కేబినెట్లో చోటు కల్పించారు కేసీఆర్. కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు, మేనల్లుడు హరీశ్ రావు కూ ఈ సారి మంత్రిపదవులు దక్కాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుకూ చోటు దక్కింది. మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమూద్ అలీ, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. ఇక ఉద్యోగ సంఘాల నేతల నుంచి ప్రజాప్రతినిధులుగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఇక ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకూ ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి